29, నవంబర్ 2018, గురువారం

మిస్ యూ అమ్మా .బుజ్జులు

దాదాపు సంవత్సరం అయ్యింది బ్లాగు రాసి ..... రాయాలని మనస్సులో ఆలోచన వుంటుందికానీ చుట్టూ పరిస్థితులు పర్మిట్ చేయడము లేదు ... అమ్మ మమ్మల్ని వదలి వెళ్ళిపోయి యేడాది దాటిపోయింది  ఆ డిప్రెషన్  నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే  నా బుజ్జులు నన్ను మా ఇంటి వారందరిని ధుఃఖ సాగరంలో ముంచివేసింది  ఇందులో తన తప్పేమి లేదు డాక్టరు నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది .... తలుచుకుంటుంటే గుండె చెఱువు అవ్వుతుంది .. నాకు ప్రాణం అయ్యినవారు ఇద్దరు లేరు ....ఒకింత విరక్తి ... జీవితం ఇంతేనా ...ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టవలసిందే కదా ...ఈ మాత్రం బ్రతకడానికి మనుష్యుల్లో ఇంత  ఆరాటం యెంతో పోరాటం ఎందుకో అనిపిస్తుంది ....రెగ్యులర్ గా యోగా  ధ్యానం తరగతులకు  వెళ్తున్నాను క్రమం తప్పకుండా ఉదయపు నడకలు నడుస్తున్నా ... మనిషిని చిక్కానే  కానీ  మనస్సులో వ్యధ ఇసుమంతయినా  తరగడము లేదు ...మనో వ్యాధికి మందు లేదంటారు ...నిజమే ...లేదు ..కాలం
మారుస్తుందేమో వేచి చూడాలి ....    మిస్  యూ  అమ్మా  .బుజ్జులు             
 పిల్లల  మధ్యలో  అమ్మ

2 కామెంట్‌లు:

Rajesh చెప్పారు...

Madam,
Everyone has to go someday, please try to enjoy the human life we are blessed with by helping others, because of the grief people who were gone won’t return, and you may be giving pain to the people who love you...

Hima bindu చెప్పారు...

thankyou