29, ఏప్రిల్ 2010, గురువారం

నా అభిరుచులు

తరుచు మనం అటు ఇటు తిరిగే క్యాంపు ల ఉద్యోగం కావడంతో ఆయ ఊర్లలో ప్రశస్తమైన పండ్లు ,పూలు అలాగే స్వీట్స్ ఏంటో కనుక్కుని నచ్చిన వాటిని తిరిగి వచ్చేప్పుడు తీసుకోస్తుంటాను..మరచిపోతానేమోనని ముందే ఎవరికైన చెప్తాను వెళ్ళేప్పుడు గుర్తుచేయమని .పూలు విషయం కి వస్తే విశాఖపట్నం లో "సింహాచల సంపెంగ "పూలు లేకుండా తిరుగు ప్రయాణం చేయాలంటే నా మనసొప్పదు .ఎక్కువగా రైల్వే స్టేషన్ లో దొరుకుతాయి ,బయట మార్కెట్ లోను దొరుకుతాయి .బోల్డన్ని గుత్తులు కొని తెచ్చుకుంటాను .తెలుపు పసుపు రంగుల్లో వుండే ఈ పూలు తరగని సువాసననిస్తాయి .సింహాచలం లో మొక్కలు కూడా అమ్ముతారు మనం మొక్క కూడా పెట్టాం కాని ఇంతవరకు పూయలేదు చెట్టు పెరగనే లేదు . మచిలీపట్టణం లో మంగినపూడి బీచ్ దారిలో అమ్మే మొగలిపోత్తుల కొరకు ఆరాటపడతాను . నెల్లూరు వెళ్ళినపుడు పినాకిని లో ప్రయాణం చేస్తే చెన్నయి నుండి తెచ్చి అమ్మే 'చెంబెలిపూలు 'తప్పకుండా కొంటాను ,అరటి నార తో మాలలు కట్టి అమ్ముతారు ..అలానే చెట్టు సంపెంగ పూలు తో పినాకిని పరిమళాలు వెదజల్లుతది,పెదవడ్లపూడి వచ్చేసరికి గంపలు గంపలు మల్లెలు విరజాజులు చేరతాయి ...ఇవన్ని పిచ్చపిచ్చగా కొనిస్తానని వేరేచేప్పక్కరలేదు
. పండ్ల విషయానికి వస్తే ఏలూరులో దొరికే జామకాయ ఇంకెక్కడా దొరకదేమో అనిపిస్తుంది ,అక్కడి కాయలు తిని ఇంకెక్కడా తినాలన్పించదు.అలానే తేగలు నిడదవోలు ,చాగల్లు లోరుచి ఇంకోటి కనిపించదు.అలానే రేగుపళ్ళు గోదావరి జిల్లాలోనే బాగుంటాయి .సీతాఫలాలు తప్పకుండా రాజమండ్రి ,జంగారెడ్డిగూడెం నల్లజర్ల పరిసర ప్రాంతాల్లోనే బాగుంటాయి ,ఒక బుట్టడు మనతో ప్రయాణం చేయాల్సిందే .
చక్కెరకేళి లు రావులపాలెం లో చాలా బాగుంటాయి ..మామిడిపళ్ళు మా జిల్లా లోనే కాకుండా ప్రకాశం జిల్లా లో 'ఉలవపాడు ' అనే ప్రాంతం కాయలు చాల స్వీట్ గా బాగుంటాయి,ఒంగోలు వెళ్ళినపుడు తోటకి పంపించి మరి తెచ్చుకుంటాను .సీసన్ అయ్యాక మార్కెట్ లో ఎక్కువ దొరికేయి ఉలవపాడు కాయలే .
ఇక స్వీట్ విషయానికి వస్తే మచిలీపట్టణం వెళ్తే 'హల్వా ''లడ్డు ''తిరుగు ప్రయాణం లో ఉండాల్సిందే .చాల ప్రసిద్ది తాతారావు స్వీట్స్ అంటే .కాకినాడ వెళ్లి వచ్చేప్పుడు మన కూడా 'కోటయ్యకాజ", తాపేశ్వరం కాజాలు ,ఆత్రేయపురం పూతరేకులు వస్తాయి ..
ఈ రోజు ఒంగోలు వెళ్లాను .ఆఫీసు పనికన్నా ముందు అల్లురయ్య మైసూర్ పాక్ కి ఆర్డర్ పంపాను .అక్కడ ఆర్డర్ చేస్తేనే మనకి దొరుకుతుంది .ఒంగోలులో చాల ప్రసిద్ధిగల స్వీట్ అది .పది యేళ్ళ క్రితం మొదటిసారి అరటిఆకులో నెయ్యోడ్తూ పొట్లం కట్టారు ,ఇప్పుడు మామూలు స్వీట్ డబ్బాలో పెడుతున్నారు ,కొంచెం క్వాలిటీ తగ్గిందనుకోవచ్చు ..ఇలా ఊరుకో స్వీట్ తెచ్చుకుని నేనే మొత్తం తింటాను అనుకుంటున్నారా !మా పాప నేను కొంచం మాత్రం తీసుకుని మా బందుమిత్రులకి తినిపిస్తాను :-)

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మా ఇంట్లో సాయి సంకీర్తన




నేను అనుకున్న రీతిలో మూడున్నర గంటలు ప్రశాంతంగా సాయి సంకీర్తన జరిగింది .ఊహించిన దానికన్నా సాయిభక్తులు తరలివచ్చారు .
సంకీర్తన నేర్పి మాకు సన్మార్గం చూపించిన ఆచార్య దేవులు శ్రీ పోనమల కోటేశ్వర రావు గారికి వందనాలు.దాదాపు పదిహేను సంవత్సరాలు నుండి వారే మా ఇంట సాయి సంకీర్తన చేసేవారు .చక్కని స్వరం వినే కొద్ది వినాలి అనిపిస్తుంది కొంచెం వృద్దాప్యం తో స్వరం లో కొంచెం బిగువు సడలింది .అయిన క్రొత్తవారు గుర్తించలేరు .ఈ రోజు పూజ మొత్తం నా కూతురి మీదే నడిచింది .బాబాని చక్కగా అలంకరించింది .ఇలా ........................................

కృతజ్ఞతలు

నాకు ఎవరైనా సహాయం చేయగానే వారికి తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను .ఆ సహాయాన్ని జీవితకాలం లో మరచిపోను ,వారి ఋణం తీర్చుకునే అవకాశం కోసం చూస్తాను .కొన్ని సమస్యలు ఎంత ప్రయత్నించిన పరిష్కారం కావు అటువంటి సమయం లో భగవంతుని పై భారం వేసి నువ్వే పరిష్కరించాలి అని అతి వినయంగా కోరుకుంటాను. వినయం అని ఎందుకు అన్నాను అంటే సమస్యలు వచ్చినపుడే 'దేవుడు'అనేవాడు మనకి గుర్తొస్తారు కాబట్టి .నిజానికి చిన్నప్పుడు నాకు భక్తి తక్కువే ,ఏదో పండుగాపబ్బాలకి అమ్మ ప్రక్కనే పూజ అయ్యేవరకి ఓపికగా కూర్చునేవాళ్ళం త్వరగా అయితే టిఫిన్ గట్రా తినేసేయ్యోచ్చని అన్నీ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే .వినాయక చవితి రోజు మరీ విసుగోచ్చేసేది ,పుస్తకం లో పేజీలు లేక్కపెట్టేదాన్ని అమ్మ గమనించకుండా .అమ్మ పురాణాలు నీతి కథలు తీరిక వేళల్లో ముఖ్యంగా సెలవల్లో ,ఆదివారాల్లో మా ఆరుగురు పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ఒకే పళ్ళెం లో అందరికి అన్నం కలిపి తినిపిస్తూ చెప్పేది .నాకు కొందరు దేవుళ్ళు గా మనసుకి అనిపించేవారు కాదు ...వారు మన చరిత్రలో రాజులు లేక ఒక తెగకి నాయకులు లా అనిపించేవారు ,అలా అని అమ్మ తో అంటే తప్పు అనకూడదు అనేది .ఏడెనిమిది తరగతులుకి వచ్చాక మిషనరీ స్కూల్స్ లో చేరడం హాస్టల్ లో ఉండటం తో అక్కడ తప్పనిసరిగా ఆదివారం ఉదయం ప్రేయర్ సర్విస్ వుండేది మానితే పనిష్మెంట్ వుండేది నిశభ్దంగా ఆ గంట గడిపేవాళ్ళం ఆ పూట బ్రేక్ ఫాస్ట్ ఏమి చేసి ఉంటారా అని .,అవకాశం వచ్చినప్పుడల్లా సిస్టర్స్ దేవుడి గురించి ,ఆ మదర్ గొప్పదనం గురించి చెప్పేవారు ,లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించే ఎక్కువ చెప్పేవారు ....ఇప్పుడు బాగుంటే చాలుగా పోయాక మనకి యెం తెలుస్తుంది ,అనుక్షణం చనిపోయాక వెళ్ళే స్వర్గం గురించి మనకి ఎందుకు వేదన అని అనుకునేదాన్ని ..
.ఇప్పుడుకూడా :-)
తరువాత తరువాత పరీక్షలప్పుడు దేవుడు గుర్తు రావడం మరల కనుమరుగవడం నా టీన్స్ లో పరిపాటయ్యింది .
కొన్ని సంవత్సరాలు అసలు దేవుడే లేడు అనుకుని నమస్కరించడం మానేసాను.సాటి మనిషికి హాని చేయకుండా ,దూషణ నెరపకుండాచేయగలిగిన సహాయం చేస్తూ, దయ కలిగి వుంటే చాలు మనకి తెలీని స్వర్గం నరకం గురించి ఆలోచించడం అనవసరం అనుకున్నాను
కొన్ని విపత్కర పరిస్థితుల్లో మనస్సును ప్రశాంతత వైపు మళ్ళించడానికి 'భావాతీతధ్యానం 'వైపు దృష్టి సారించాను.గురువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాను .నా ఆలోచన పరిధి విస్తారమయ్యింది(బహుశ వయస్సు కారణం కావచ్చు )
మనకి తెలియని ఒక అధ్బుతమైన శక్తి ఒకటి మనల్ని నడిపిస్తుంది అని నమ్మకం ఏర్పడింది ,ఆ శక్తి కి ఎవరికి తోచిన విధం గా ఆ పేరుతో పిలుస్తారు కాబోలు అనుకుంటాను .ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి సమాధానాలు దొరికిన పుస్తకాల్లో వెదుక్కుంటాను తరుచు మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళ సంభాషణలో దొరుకుతుంటాయి
నాకు కావలసిన శక్తి ,ధైర్యము కోసం ఆ భగవంతుని అడుగుతుంటాను గురువు సహాయం తో ....
నాకు నిరంతరం తోడుగా అన్ని వేళలునన్ను హెచ్చరించి మానవత్వం నాలో నశించకుండా కాపాడే దైవ సమానుడు "శ్రీ సాయి"
ఎంతటి జటిల సమస్య వచ్చిన వివేకం తో మెలిగి ఆ సమస్యను తొలగిపోయేలా చేసుకొనడానికి నాకు ఎంతగానో సహాయపడుతుంటారు .
రెండేళ్ళ క్రితం నన్ను చుట్టుముట్టిన సమస్య విడిపోయి మనస్సుకి ప్రశాంతత చేకూరింది .నన్ను నడిపిన గురువుకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ రోజు సాయంత్రం ఇంట్లో అయిదు నుండి ఎనిమిదిన్నర వరకి సాయి సంకీర్తన ఏర్పాటు చేసాను .సాయి ని అనుసరించేవారంతా ఆహ్వానితులే ....అనంతరం ఫలహారం కూడా .....................

21, ఏప్రిల్ 2010, బుధవారం

ఒక్క నిమిషం

దాదాపు అన్ని స్కూళ్ళ లోను కాలేజిలలోను ఫైనల్ పరీక్షలు అయ్యిపోయి వేసవి సెలవలు మొదలయ్యాయి .పదవతరగతి రాసిన పిల్లల విషయంలో ఇప్పటికే తల్లిదండ్రులు అప్పోసప్పో చేసేసి ఏదొక కార్పోరేట్ కాలేజి లో సీట్ రిజర్వ్ చేసేసుకుని వుంటారు .ఆ పిల్ల భవిష్యత్తు దాదాపు స్కెచ్ వేసినట్లే రెండేళ్ళు రెసిడెన్స్ కాలేజి ఆనక "ఎంసెట్"లాంగో షార్ట్ టేర్మో..తరువాత ఇంజినీర్ ,డాక్టర్ ..ఆ తరువాత "డాలర్ ".......గ్రామాల్లోను ,పట్టణాల్లోను ఇదే బాట .ముఖ్యంగా మా కోస్తా వారి ప్లాన్ ఈ విధం గానే వుంటుంది .
పిల్లల కి చదువు చెప్పించడం సామాన్యులకి తలకి మించిన బరువుగానే తోస్తుంది ,అయిన వున్నా కుంటా ,సెంటు తెగనమ్మి పిల్లలికి చదువు చెప్పిస్తు కార్పోరేట్ కాలేజీలను కుభేరుల్ని చేస్తున్నారు
స్థోమత వున్నవారు ఏవిదం గా చేసిన పెద్ద నష్టపోయేది ఏముండదు ,ఎటొచ్చి లేని వారి పరిస్థితే ఆలోచించాలి .దాదాపు గ్రామాల్లోనే 70 % నివసిస్తున్నారు చాలావరకు వ్యవసాయం ,కూలిపనులు చేసేవారే ఎక్కువ ,వారంతా గ్రామం లో వున్నా ప్రభుత్వ బడిలో తమ పిల్లల్ని చదివిస్తూ ఆ పైన చదివించలేక ఎటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందో తగిన సమాచారం లేక ఆ ఊరి పెద్దో ,మోతుభారి రైతో ,లేక అక్కడి ఉపాధ్యాయుని సలహా చేత తమని మించిన బరువైన ఇంజినీరో ,డాక్టరీ నో చదివించాలని తము తిని తినక పిల్లల్ని పట్టణాల్లో రెసిడెన్సీ కాలేజీల్లో చేర్పిస్తున్నారు .పిల్లలు చదివి ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళు సెటిల్ అయ్యి పెద్దవారిని మంచి చెడు చూసుకునే సమయానికి వారు తలకి మించిన అప్పులతో ఆరోగ్యం క్షీణించి వృద్దాప్యం తో ఒంటరిగాకాలం వెళ్ళబుచ్చడం జరుగుతుంది .
పైన పేర్కొన్న చదువులే కాక ఎన్నో రకాల వృత్తివిద్యలు వున్నట్లు బహు కొద్దిమందికి మాత్రమె తెలుసు .పదవతరగతి పూర్తి కాగానే ఒకటి లేక రెండు సంవత్సరాల సర్టిఫికట్ కోర్సు చేయగానేవెంటనే ఉపాధి లభిస్తుంది దానిని ఆధారం చేసుకుని ఆ పై డిప్లోమ ,ఇంజినీరింగు డిగ్రీ చేయడానికి ఎంతో అవకాశం వుంది .దాదాపు ఇటువంటి వృత్తి విద్యలు 65trades మన రాష్ట్రం లోనే పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో లభిస్తున్నాయి .అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే డిప్లోమ కోర్సుల తో త్వరితగతిన ఉపాధి పొందవచ్చును తన కుటుంబం కి ఆసరాగా నిలబడుతూనే పై చదువులు చదవను వచ్చు.ఇవే కాక పారామెడికల్ కోర్సులు చేసి వెంటనే ఉపాధి పొందవచ్చును .
పదవతరగతి ,ఇంటర్ చదివిన తరువాత పై చదువులు గాని ,ఏదైనా ఉపాధి సంభందిత సమాచారం పొందాలంటే మీ జిల్లా లోని ఉపాధి కార్యాలయం లో ఉన్నటువంటి ఒకేషనల్ గైడెన్స్అధికారిని సంప్రదించినట్లయితే తగిన సమాచారము ,సలహాను పొందవచ్చును .అభ్యర్ధి అభిరుచి సాంఘిక స్థోమత బట్టి అభ్యర్దికి లభించే అవకాశాలు ,స్కాలర్షిప్పులు,మార్గదర్శకాలు పొందవచ్చును .
తగిన సమాచారం కోసం ఈ క్రింద పేర్కొన్న వెబ్ సైట్ చూడవచ్చును .

పైన రాసిన సమాచారం చదివిన ఏ ఒక్కరైన (ముఖ్యం గా ఉపాద్యాయులు ) తమకి తెలిసిన పిల్లలకి తెలిపినచో వారి జీవితానికి ఎంతోకొంత సహాయపడినవారు అవ్వుతారు .మనం వెచ్చించే అర నిమిషం చాలు చిన్ని సలహా జీవితాన్నే ఉన్నత స్థితికి మార్చొచ్చు .

17, ఏప్రిల్ 2010, శనివారం

GREETINGS

ఈ రోజు ఆంగ్ల సంవత్సరాది ప్రకారం పుట్టినరోజు జరుపుకునే బ్లాగ్ మిత్రునికి "జన్మదిన శుభాకాంక్షలు ". ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని .........
HAPPYBIRTHDAY.

11, ఏప్రిల్ 2010, ఆదివారం

DON'T MAKE THEM SHED TEARS


WE ALWAYS CRITISIZE ,TERRORISTS,NAXALS AND MANY OTHERS FOR THEIR VIOLENT WAYS OF INJURING AND KILLING OTHERS.
BUT HOW ARE WE DIFFERENT !
INFACT WE ARE MUCH WORSE.
UNLIKE THEM WE DON'T MIND INFLICTING FATAL,
EMOTIONAL WOUNDS TO OUR OWN LOVED ONE
JUST TO SATISFY OUR " EGO "
LIFE IS SHORT ................MAKE THE MOST OUT OF IT.
NO ONE IS PERFECT...... LEARN TO ACCEPT IMPERFECTION
IN OTHERS . EVERYONE LIKES TO BE LOVED....
SO , LEARN TO LOVE.
EVERYONE LIKES TO BE RESPECTED SO,
LEARN TO RESPECT.
BOTH PERFECTION AND IMPERFECTION ORIGINATE FROM YOU
AND RADIATE INTO THE WORLD...........
PRACTISE LOVE
PRACTISE TOLERANCE
PRACTICE PATIENCE
PRACTISE RESPECT
PRACTISE TRUST , PEACE AND HARMONY.
THERE IS NO POINT IN SHEDDING TEARS
WHEN SOMEONE PASSES AWAY . RATHER IT IS IMPORTANT TO
ENSURE THAT WE DONT MAKE THEM SHED TEARS WHEN THEY ARE WITH US NOW........
WITH LOVE AND RESPECT
CHINNI

"శిశిరం అయిన శిధిలం అయిన


ఆకులు రాలే వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే................
తోలకరికోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
హిమముల రాలి సుమములై పూచి
రుతువులై నవ్వి ..మధువులై పొంగు ...............................
"శిశిరం అయిన శిధిలం అయిన
విడిచిపోబోకుమావిరహం అయిపోకుమా................ "

7, ఏప్రిల్ 2010, బుధవారం

బుల్లి ఫ్రెండు


మమ్మీకి ఉన్నాడు ఒక ''బుల్లి ఫ్రెండ్ "
వస్తాడు మా ఇంటికి అప్పుడపుడు
తెస్తుంటాడు తీయని చాక్లేట్సూ
హిమ క్రీములు బోలెడు బోలెడు
చెబుతుంటాడు ఎన్నో ఫన్ని
ఫన్నికబుర్లు మాకు
ఒక మాట మాట్లాడి ఒక
నిమిషం పాటు నవ్వుతుంటాడు
ఒక గంట కబుర్లు చెబితే వాటిలో
45 నిమిషాలు నవ్వులే వుంటాయి
ఇది మా నవ్వుల ఫ్రెండు కథ
(హి..హి ..హి ..నాకు స్వంత బ్లాగ్ లేదు కదా అందుకే మా మమ్మీ బ్లాగ్ అరగంట అద్దికి తీసుకున్న )
బై
చిన్ని డాటర్

2, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఈ వేళలో

తొలి పొద్దువై వచ్చావు
జాబిల్లివై వెలిగావు
కాలమంతా కౌగిలింతై
కలల అలల పై కదిలించావు
నీ కన్నుల్లో కనుపాపని చేసి
కమ్మని కలలే చూపావు
ఎడబాటుతో తడబడిపోయా
ఏకాంతం లో నిన్నే తలిచా
తొలి వలపు పిలుపు విన్నా
నీలి మేఘాలలో నీకై వెదికా
కలలలుగా కదిలే నీలి మేఘాలు
సంధ్య కాంతులకి తల్లడిల్లి
నిశబ్ద నిశీధిలో నలుపెక్కాయి
మసక మసక చీకటికి
సువాసనలద్దె మల్లెలమ్మ
మనసు విప్పితమకంగానవ్వింది
(డైరీలో ఒక పేజి )
.