15, ఏప్రిల్ 2020, బుధవారం

'కరోనా' కాకి

నాకిప్పుడు అర్ధం అయ్యింది ... 23 ఏళ్ళ తరువాత . హిస్టరీ పుస్తకాలు తీసినప్పుడల్లా ఇండస్ వాలి సివిలైసేషన్ అర్ధాంతరంగా అదృశ్యం అవ్వడానికి చరిత్రకారులు చెప్పే కారణాలు ఒకదాని తరువాత ఒకటి కళ్లముందు కదలాడుతుంటాయి ... శత్రువుల దండయాత్ర అని నదీముంపు  ఫ్లడ్స్ ..ప్రకృతి వైపరీత్యాలు ,,,,రకరకాలా కారణాలు ... ఒక్కోచోట శవాల గుట్టలు ...మొహంజొదారో అంటేనే చావులదిబ్బ  విశ్లేషణ !!!
ఇటీవల ఇటలీ కరోనా తో అల్లాడుతున్న దృశ్యాలు ,,నగరమంతా నిర్మానుష్యముగా {వ్వాట్సాప్ పిక్స్ }...అవి నిజమో కాదో ...మృతులను సామూహికముగా తీసుకుపోయి ఖననం చేస్తున్న తీరు ...అందమైన ఇల్లు వదిలి వెంటిలేటర్ మీదో స్మశానం లోనో ...దీర్ఘ నిద్రలో....
సీన్ కట్ చేస్తే  కొన్ని వేల సంవత్సరాల తరువాత భావితరము బుర్రబద్దలు కొట్టుకుంటుందేమో .... ఇల్లు కట్టుకునేప్పుడు  తవ్వకాలు చేసేప్పుడో  బయటపడే సామూహిక అస్థిపంజరాలు చూసి .... వాళ్లకి మాత్రం తెలియదు  'కరోనా' కాకి వీళ్లందరినీ ఎత్తుకెళ్లిందని ... 
ఇంతకీ నే చెప్పొచ్చేదేమంటే  అప్పట్లోకూడా ఇలాంటి మహమ్మారి ప్రబలి సింధు నాగరికతను అంతం చేసి ఉండొచ్చని !