28, ఫిబ్రవరి 2010, ఆదివారం

జ్ఞాపకాలపూలు


మాఆంద్ర లయోలా కాలేజి పూర్వ విద్యార్ధుల సమావేశం రేపు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఫాదర్ దేవయ్య ఆడిటోరియం లో జరగబోతుంది.ఆహ్వానం అందిన వెంటనే అవకాశం వున్నవారందరం కలుద్దాం అని నిర్ణయించుకున్నాం .ఆ కాలేజిలో చదవడం వలన క్రమశిక్షణ ,విలువలు మానవత్వం నేర్చుకున్నాం .
మా కాలేజి డిసిప్లినే కి మారు పేరు ఉదయం మొదటి గంట కొట్టే సరికే క్లాసు రూం లో వుండాలి పొరపాటున లేట్ అయ్యామా మా ఇన్నయ్య ఫాదర్ పులిలా కర్ర పట్టుకుని ఆఫీసు రూం దగ్గరలో వుండేవారు అందరు ఒకటే ఉరుకులు పరుగులు .ఆ ఎదురుగానే వున్నా 'మారిస్ స్టెల్లా' లోఇంత క్రమశిక్షణ వుండేది కాదు ఎలా తెలుసంటే మనం డిగ్రీ అక్కడే చదివాం గ్యాంగ్ మైంటైన్ చేస్తూ బోల్డన్ని యవ్వరాలు నడిపెవాళ్ళం.

మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యేట్ డిపార్టుమెంటు మా బాచ్ తోనే మొదలయ్యింది .డిపార్టుమెంటు అఫ్ సోషల్ వర్క్ లో మేము ముప్పయ్యి మందిమిఅలానే ఇంగ్లీష్ డిపార్టుమెంటు లో ముప్పయ్యి .అసలు ఆడపిల్లలు ఆ కాలేజిలో అడుగుపెట్టడం కూడా మాతోనే .ప్రారంబోత్సవం ఒక వేడుకలా చేసారు .ఆనాటి అతిధులుగా దివంగత మంత్రి ఇంద్రారెడ్డి ,శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

చదివిన రెండున్నర సంవత్సరాలుఆ కళాశాల మా మీద ఎంతో ప్రభావం చూపింది .ముఖ్యంగా మేం ఎంచుకున్న ఫీల్డ్ మా ఆలోచన దృక్పధాన్నేమార్చేసింది.మూడురోజులు క్లాస్ వర్క్ మూడు రోజులు ఫీల్డ్ వర్క్ వుండేది
మా చదువులో భాగంగా మురికి వాడలు,అనాధ శరణలయిన నిర్మల్ హృదయ భవన్ ,జువనైల్ హోములు మెంటల్లీ రెటార్దేడ్ హోంసు స్త్రీ సంరక్షణ సంస్థలువిజిట్ చేసి.వారితో కలసి కేసు వర్క్ ,గ్రూప్వర్క్ చేయడం ....ఇవన్ని మాకు వాస్తవ జీవితం ఎలా ఉంటోందో అనేధీ ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. .క్రిమినల్ రిఫార్మేషన్ లో నాస్తిక కేంద్రంలో గోరా గారి కుమారుడు 'లవణం 'గారిపర్యవేక్షణలో ఫీల్డ్ ట్రైనింగ్ మరపురాని జ్ఞాపకం .

మా చదువులో భాగంగా మచిలీపట్టణం దగ్గర సముద్రంలో ఒక దీవి వంటి కుగ్రామం లో సైక్లోనే సెంటర్లో పదిహేను రోజులు ఆ గ్రామస్థులతో పాటు నివసించాము.అక్కడి యువత తో కూడి రెండు కిలోమీటర్ల పొడవు గ్రావెల్ రోడ్ వేసాము .చీకటిలో షెల్టర్ హొం పైకి వెళితే సముద్రపు హోరుచుట్టూ మినుకు మినుకు మనే చుక్కలు,దూరంగా లైట్ హుసే నుండి వుండుండి వెలుగు ...హ్మం అద్భుతమైన అనుభవం ..గ్రామస్తుల తో కలిపి ఆటలు పాటలు తిరిగి విడిచి రావడానికి ఎంతో బెంగ పడ్డాము.
రెండో సంవత్సరం లో మేం ఎంచుకున్న గ్రూప్ బట్టి కే.సి.పి సుగర్స్ లో ,సిరిస్ లో ,హెచ్ .ఎ.ఎల్ లో మా ఎక్జిక్యూటివ్ ట్రైనింగ్ జీవితానికి అపారమైన అనుభవాన్ని ఇచ్చింది .అక్కడ చదివిన రెండేళ్ళు చాల చూసాం మాకు తెలియని ప్రపంచాన్ని చూసాం చుట్టూ వున్నా సమాజాన్ని చూసి వేదన చెందాము ఎటువంటి పరిస్తితుల్లోనయిన బ్రతకొచ్చు అనే సూక్ష్మ సత్యాన్ని తెలుసుకోగలిగాం.



మా సైకాలజీ మేడం సంధ్య భల్ల తో నా స్నేహం కళాశాల వార్షికోత్సవం లో మేం ప్రదర్శించిన నాట్యం .,నేను వెలగబెట్టిన సోషల్ వర్క్ అసోసియేషన్ అద్యక్ష పదవి ,ఆధిపత్యాన్ని సహించలేక రెండు గ్రూపులైన మేము ;):)
మార్కులకోసం ,యునివెర్సిటీ ర్యాంక్ కోసం మా తాపత్రయం ఎన్నో ఎన్నెన్నోతీపి జ్ఞాపకాలు . మాడిపార్ట్మెంట్ హెడ్ ఫాదర్ .దాస్ నిరంతరం స్పూర్తిదాయకంగా అడుగడుగునా అభినందిస్తూ సమాజం పట్ల మా భాద్యత గుర్తు చేసిన తీరు మరచిపోలేనిది మా రెక్టార్ ఫాదర్ అమలరాజ్ ప్రిన్సిపాల్ ఫాదర్ ఇన్నయ్య మమ్మల్ని చాల చాలా గారభం గా చూసేవాళ్ళు వేరే స్టేట్ నుండి వచ్చిన విసిటర్స్ కి మమ్మల్ని గర్వంగా పరిచయం చేసేవాళ్ళు (ఇంగ్లీష్ వాళ్ళని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు :):)
ఈ రోజు అందరం దాదాపు చక్కగానే స్థిరపడ్డాం. కొన్నాళ్ళ క్రితం మాలోని ఒక మిత్రుని మరణం తీరని వేదన కలిగింది.ఫాదర్ తిక్మూరే ప్రత్యేకంగా ప్రేమగా పంపిన ఆహ్వానాన్ని చూసి అందుబాటులో వున్నవాళ్ళం అయిన కలవాలని నిశ్చయించుకున్నాం ..


.

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

హై వే ఎప్పుడొస్తుందో ?


మొన్నీ మధ్య అత్యవసరంగా హెడ్ ఆఫీసు కి వెళ్ళాల్సి వచ్చింది .మీటింగ్ అటెండ్ అయ్యి వెంటనే తిరిగి వచ్చేయొచ్చు ఏ టైం అయిన అని రోడ్ మార్గం ఎంచుకున్న .నాతో పాటు క్యాంపు క్లార్క్ ,ఆఫీసు సబ్ స్టాఫ్ వున్నారు .ఆ సబ్ స్టాఫ్ ఏడాది క్రితం తండ్రి చనిపోతే కంపషినాట్ గ్రౌండ్స్ లో చేరాడు ,చదువు పెద్దగ లేదు పది చదివినట్లున్నాడు వయసు పందొమ్మిది ఉండొచ్చు . నా ఆఫీసు కి వచ్చే ఫ్రెండ్స్ అతన్ని ముద్దుగా అతి వినయం అని పిలుచుకుంటారు .నేను ఊరు బయలుదేరుతుంటే "అమ్మ నేను వస్తాను ఇంతవరకి హైదరాబాద్ చూడలేదు " అన్నాడు . అతనికి వైజాగ్ నుండి నెల్లూరు వరకే తెలుసు తరచూ నా కూడా ఉంటాడు .ప్రయాణం మొదలవ్వగానే అలవాటు ప్రకారం పుస్తకం తీశాను ,ఎప్పుడో మొదలెట్టి వదిలేసినా 'ది అల్కెమిస్ట్ ' తీశాను . ఈ పుస్తకం కంటే ఈ ముగ్గురి పిల్లల కబుర్లే ఆసక్తిగా వున్నాయి .డ్రైవర్ కూడా ఇంచుమించు మా అతివినయం వయసే .పుస్తకం పక్కన పడేసి నేను కూడా వాళ్ళ సంభాషణలో పడిపోయాను .అప్పటికి మేం బయలుదేరి మూడు గంటలు అయ్యింది .ముందు సీట్లో వున్నా డ్రైవెర్ని వినయం విసిగిస్తున్నాడు నాకు వినబడకుండా .డ్రైవెర్ తెగ నవ్వేసుకుంటూ వస్తుంది ..వస్తుంది అంటున్నాడు .మా క్లార్క్ కూడా నవ్వుతున్నాడు .,ఇద్దరు కలసి ఆ అబ్బాయిని ఎడ్పిస్తున్నారు.ఏవిటని అడిగితె ఎమిలేదంటారు .మరో అరగంట తరువాత ఆ పిల్లాడు అడగడం మరల అదే సమాధానం చెప్పి నవ్వడం చేస్తున్నారు . ఇక వాళ్ళు నవ్వలేక నాకు చెప్పారు ,.."హై వే ఎప్పుడొస్తుంది" అని మూడు గంటల నుండి అతివినయం వాళ్ళ ప్రాణం తీస్తున్నాడని ,డొంక రోడ్లో ఎందుకన్నా బండి తీస్కేల్తావు హై వే లో పోనీయమని .వీళ్లేమో ముందు వస్తుంది అని మభ్యపెడుతూ అతన్ని ఆడుకుంటున్నారు .అతని అమాయకత్వానికి నేను కూడా నవ్వులు కలిపి ఇంకో గంటలో రావొచ్చు అన్నాను .మేం ఇంకో గంట ప్రయాణం చేస్తే ఫోర్ వే వస్తుంది అని ,మనం ఇప్పటివరకి ప్రయాణం చేసింది హై వే నే 'డొంక రోడ్డు "కాదు ,ఇంకా ఈ రూట్ చెన్నై కలకత్తా రూట్ లా ముస్తాబు అవ్వడానికి మరికొంత కాలం పట్టొచ్చు అని వివరించాను .ఎంతో గొప్పగా ఊహించి హైదరాబాద్ ప్రయాణం అయ్యిన మా వాడికి ఊహించని షాక్ ఈ హై వే . అయిదవ నంబరు జాతీయ రహదారి మీద ప్రయాణం చేసిన వారికి తొమ్మిదో నంబరు రహదారి అదీ నందిగామ నుండి హైదరాబాద్ వరకి నరకమే . నల్గొండ జిల్లా మొదలైన దగ్గరనుండి అడుగడుగునా మోహరించిన ' రక్షక దళం' రహదారి కి రెండు చోట్ల చిన్చిఛిన్న గోడలు, కూల్చి వేసిన దృశ్యాలు .ఈ రక్షకదళం లేకపోతె సురక్షిత ప్రయాణం కల.
నిత్యం వేల వాహనాలు తో అతి రద్దీ గా వుండే ఆ రహదారి ఇప్పటికి అభివృద్ధి చెందలేదు. ఇరుకైన దారులు ,మలుపులు దారుణమైన ఆక్సిడెంట్లు ఆ దారిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా వున్నా అవతల వచ్చే క్వారీ లారీ వాళ్ళు జాగ్రత్తగా వుండరు .పదిహేను ఏళ్ళ క్రితం నాన్న కజిన్ ఫ్యామిలీ తో మా భందువుల పెళ్ళికి వస్తు చిట్యాల దగ్గర దారుణమైన ఆక్సిడెంట్ కి గురయ్యారు. స్టేట్స్ లో చదువుతున్న పెద్ద అమ్మాయి తప్పించి నలుగురు పిల్లలు ,ఆ పిన్ని బాబాయి తీవ్రంగా గాయపడ్డారు ఆయన స్పాట్ డెడ్ చిన్న వయసులోనే . .ఆ దారి నా చిన్నప్పటి నుండి ఇప్పటికి అలానే వుంది.ఆ దారి మృత్యు రహదారి .
ఆ రోడ్ మార్గాన్ని ఆధునికరించాల్సిన అవసరం యంతైన వుంది ప్రమాదాలు నివారించే దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలి ......
చూడాలి ఈ హై వే ఎప్పుడొస్తుందో -:):). .
.

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఏకాంత సౌధం లో

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో
నిదురించు ఓ జహాపనా
నిదురించు ఓ జహాపనా

పండు వెన్నోల్లో ....వెండి కొండల్లే !పం !
తాజ్ మహల్ .....ధవళ కాంతుల్లో
నిదురించు.......... జహాపనా
నిదురించు........... జహాపనా

నీ జీవితా...జ్యోతీ.......నిను చూడ మూర్తీ
ముంతాజ సతి ....సమాధీ
సమీపానా నిదురించు జహాపనా
నిదురించు ......జహాపనా .!.ఈ !

నా డైరీ లో ఒక పేజీ .
ఈ పాటఎన్ని సార్లు విన్న మరీ మరీ వినాలనిపిస్తుంది పౌర్ణమి వెన్నెల్లో తాజ్ మహల్ అందాలు , చివరిరోజుల్లో కొడుకు చేత బందీ అయ్యి ప్రియమైన తన భార్య కోసం వేదన చెందే దృశ్యం మనోఫలకం పై గోచరిస్తుంది . పాట ఎవరు పాడేరో తెలియదుకాని సినిమా "నీరాజనం "ఇందులో పాటలన్నీ చాల చాల బాగుంటాయి .సంగీతం ఓ.పి.నయ్యర్.
.మనస్సు బరువెక్కుతుంది.. మనసులోని మమత ఏరులై కన్నీరై నన్ను తడిపేస్తుంది .ఒలికిన పాలను ఎత్తలేని నా నిస్సహాయత నన్ను కుదిపేస్తుంది .



19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

నేలటికేట్

హమ్మ్...ఇన్నాళ్ళకి నేలటికెట్ తీసుకొని సినిమా చూసాను.చిన్నప్పుడు చాలాసార్లు అనుకునేదాన్ని ఎంచక్కగా స్క్రీన్ కి దగ్గరగా కూర్చుంటే అందర్నీ దగ్గరనుండి చూడొచ్చు కదా అని ,ఆ కోరిక ఇన్నాళ్ళకి మా అమ్మాయి ద్వారా తీరింది .
మద్యాహ్నం ఇంటికి లంచ్ కి వెళ్ళగానే నా కూతురు ,చెల్లి కూతురు పెద్ద ప్లాన్ తో ఎదురొచ్చారు ,యెట్టి పరిస్థితిలో ఈ రోజు శేఖర్ సినిమా "లీడర్ "చూడాల్సిందేనని పైగా అదీను ఈ రోజే రిలీజ్ అయ్యిందని వాళ్లకి జతగా చెల్లి వంతపాడింది,టికెట్స్ రిజర్వు చేయించమని. అరగంటలో సినిమా మొదలవబోయే సినిమాకోసం అడగక అడగక అడిగారు పిల్లలని కాస్త పెద్ద మనస్సు చేసుకుని నాలుగు టికెట్లు సంపాదించాను ,వాళ్ళు టికెట్స్ ఇచ్చేప్పుడు స్క్రీన్ ఒన్ అనగానే ఎదోకట్లే వీళ్ళు (నేను )సినిమా చూడటం కావాలిగాని అంటూ లోపలి వెళ్లాం .వెళ్ళాక గాని తెలియలేదు అది నేల టికెట్ అని స్క్రీన్ కి దగ్గరలో రెండో వరుసలో కూర్చున్నాం.సినిమా మొత్తం తల కొంచెం పైకి యెత్తి చూడాల్సి వచ్చింది (సీట్స్ దరిద్రంగా వున్నాయి ) వందరూపాయలు టికెట్ ,పేరుకి inox .జీవితంలో మొదటి ఆట మొదటిసారి స్క్రీన్ కి అత్యంత దగ్గరలో చూసాం ,ఏదో శేఖర్ కమ్ముల కాబట్టి కాస్తంత సర్దుకున్నాను లేకపోతె వాళ్ళని అక్కడ వదిలేసి చక్క వచ్చేసేదాన్ని.ఆనంద్ గోదావరి తో శేఖర్ అభిమానిని కనీసం హ్యాపీ డేస్ లా అయినా సినిమా ఉండకపోతుందా అనే ఆశ తో ఓపికగా సినిమా అంతా చూసాను .
ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు.....అనిపించింది .ఏవిటి కథా అని ఆలోచిస్తే "నల్లధనం" వెతికి తీసి ప్రజలకి పంచాలి అన్నా సందేశం కనిపిస్తుంది .మరీ లీడర్ టైటిల్ కొంచెం కన్ఫుజింగా వుంది తల్లి పాత్ర ద్వారా లీడర్ వేరు పోలిటిసియన్ వేరు అని చెప్పించడం , తండ్రి సాధించలేక అవినీతి వ్యవస్థలో కొట్టుకుపోవడం ,దానికి విరుగుడుగా తానూ సాధిస్తాను అనడం ఆ లక్ష్యం చేరుకోవడానికి తండ్రి సంపాదించిన నల్లధనాన్నే వాడుకుని ముఖ్యమంత్రి కావడం చిరాకు కలిగించింది .అసలుకే తక్కువ సినిమాలు చూస్తాను చూడక చూడక చాలారోజులకి చుస్తే సినిమా నిరాశాపరచినదే అనిపించింది .పాటలు 'జయ జయ ప్రియబారత ,మా తెలుగు తల్లి బ్యాక్గ్రౌండ్లో వినులకింపుగానే వున్నాయి చివరిలో వచ్చిన కాథానాయకి కళ్ళకింపుగా ముద్దుగా వుంది,అన్నట్లు ఆమె కట్టిన చీరలు బాగున్నాయి,పాటలు పర్లేదు .

6, ఫిబ్రవరి 2010, శనివారం

సంవత్సరం అయ్యింది !

శుక్రవారం 6 ఫిబ్రవరి 2009

కొత్తగా బ్లాగు లోకం లోకి..

ఇదో కొత్త ప్రపంచం నాకు..ఇల్లు, ఉద్యోగం..కొంచం ఖాళీ దొరికితే మనసుకు నచ్చే పుస్తకాలు, సంగీతం.. కొద్ది రోజుల క్రితం వరకు ఇదే నా ప్రపంచం. ఇప్పుడు కొత్తగా బ్లాగులతో పరిచయం అయ్యింది.. మీ అందరితో పంచుకోడానికి నా దగ్గర ఎన్నో ఊసులు ఉన్నాయనిపించింది..అందుకే ఈ చిరు ప్రయత్నం.. నా బ్లాగులోకి మీ అందరికి స్వాగతం..



మళ్లీ ఇదేమి పిచ్చి అనుకుని నవ్వకండే... గత ఏడాది ఇదేరోజు బ్లాగ్ లోకంలోకి ప్రవేశించాను . పైన టైపు చేసింది నేను కాదు ,నేను ఏమనుకుంటున్న నో చెబితే నా ఫ్రెండ్ రాసారు ఓపికగా నా అల్లరి భరిస్తూ (అర్ధం కాక విసిగిచ్చేసాను ).......
నాలోని ఊహలుకు నాలోని ఊసులకు నడకలు నేర్పావు -:) మా బ్లాగ్ గురువుగారికి నమస్కారములతో .
-చిన్ని