30, సెప్టెంబర్ 2009, బుధవారం

ప్రతి దినం నీ దర్శనం దొరకునా ........

ప్రతిదినం నీ దర్శనంమరి దొరకునా..దొరకునా..... .
నిను చూడని రోజు నాకు రోజు కాదు......
తప్పదని తెలుసు అయిన నా మనస్సునా మాట వినదే ....అయ్యో దీనికి జత నా కళ్ళు కూడా తోడయ్యాయే ..
...హమ్మయ్య నక్షత్రాలను కమ్మేసి కారుమబ్బులు ఆత్మభందువుల్లా చల్లగా కమ్ముకున్నాయి ......
నా కోసం కరుణించి చిందించిన జల్లులు నన్ను ,నా మనస్సులోతడిని కడిగేసినా మసకబారిన కళ్ళతో నవ్వుతు నే చెప్పిన వీడ్కోలు .... కొండంత ధైర్యం తో అమ్మ కలలకోసం లక్ష్యం వైపు నీ గమనం .................
ఆ రోజు కోసం నేను ..............వేచివుండలేనా ?

26, సెప్టెంబర్ 2009, శనివారం

"ప్రతిసారి ఒక్కరు మిస్సింగ్ "

యే వి.ఐ .ఫై మిస్ అయ్యారా మాకు తెలీకుండా అని బోల్డంత ఆశ్చర్యపోతున్నారా ?....అబ్బే రాజకీయనాయకులు కాదు బ్యురోక్రట్స్అంత కన్నాకాదు ....ఒక యెమ్.యెన్ .సి లో ఎగ్జిక్యూటివ్ స్థాయి వాడు మా శీనుగాడు ఈ సారి పండగకి మిస్ అయ్యాడు,ప్రతిసారి అంతే ఏదోక అకేషన్ పెట్టుకుని మేము ఆరుగురు పిల్లలం (పెద్దోల్లమే)కలుద్దామంటే ఒక్కళ్ళు తప్పనిసరిగా మిస్ అయ్యి అయిదుగురు మాత్రమె కలుస్తాము ,మా వెనుక తోకలు (అల్లుళ్ళు కోడళ్ళు ...అమ్మ వాళ్లకి )వచ్చిన రాకపోయినా అస్సలు పట్టించుకోము ....కొంచెం మాకు ఒక్కొక్కళ్ళకు ఉన్న ఒక్కో పిల్లకాయల్ని మాత్రం వెనకాలే పట్టుకుపోతాం అమ్మగారింటికి ..రెండు మూడేళ్లు ఒక చెల్లి అమెరికాలో వుండిపాపం తను మిస్ అయ్యేది ...కొన్నిసార్లు కొలువుకి సెలవు లేక అక్క ,లేక పెద్ద తమ్ముడో ....ఎప్పుడు అమ్మ వాళ్ళని వదలకుండా పక్క వీధిలో కాపరం వుండే మనం మాత్రం ఎప్పుడు మిస్ అవ్వం ....పెద్ద చెల్లెలైన అప్పుడప్పుడు మిస్ అవ్వుద్ది ...అందరు అమ్మవాల్లింటికి చేరారు మనం కూడా రెండు రోజులు అక్కడే .....మా కబుర్లకు అంతే వుండదు ......నిజమైన పండుగ మాకు ఇప్పుడే ...అమ్మ నాన్నకి కూడా ................
'' బ్లాగ్ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు ''

23, సెప్టెంబర్ 2009, బుధవారం

''నా ముద్దు పేరు ''

నాకు చిన్నప్పటినుండి నాకున్న పేర్లతో పెద్ద తలనొప్పి వుండేది.నాకు అందరిలానే స్కూల్ రికార్డ్కి ఒక పేరు ఇంట్లో పిలవడానికి ఒక పేరు వుండేది.అప్పట్లో నా వయస్సు పిల్లలు నా పేర్లను ఎగతాళి చేస్తుంటే కొంత వయస్సు వచ్చేవరకు భాధపడే దాన్ని తరువాత తరువాత నా అస్సలు పేరు అర్ధం తెలిశాక భాధపడ్డం మానేసాను కాని ఇప్పటికి నేను ఇబ్బంది పడేది నా ముద్దు పేరుతోనే .చిన్నప్పుడు పల్లెటూరు వెళ్ళినప్పుడల్లా నా తోటి పిల్లలు నాకు కోపం తెప్పించాలంటే నా ముద్దుపేరును పదేపదే పిలిచేవారు,అదేమంటే మీ అక్కవాళ్ళు పిలవడం లేదా అనేవాళ్ళు .మా అమ్మ దగ్గర ఏడ్చేదాన్ని పైగా'' నీవేమో చక్కగా బేబీ అని పెట్టుకుని నన్నేమో ఇంత పిచ్చి పేరుతో పిలుస్తారా'' అని .
దానికి మా అమ్మ ఒక కథ చెప్పుకొచ్చేది ..
అమ్మకి ముగ్గురు తమ్ముళ్ళు వుండేవారట ,కాని మాకు ఊహ తెలిసాక ఇద్దరు మాత్రమె తెలుసు,అందరిలో పెద్ద తమ్ముడు తన పద్దెనిమిదవ ఏట అకాల మరణం చెందాడట..అప్పుడు నేను నెలల పిల్లనట ,తన పాకెట్ మనీతో నాకు మబ్బురంగు క్రేప్ గౌన్ కొనుక్కోచ్చాడట ,అమ్మ నాకు ఆ గౌన్ తొడిగితే పచ్చగా మెరిసిపోతున్న (అప్పుడు) నన్ను మామయ్యా ఎత్తుకుని''అక్క దీనిని ఈ రోజు నుండి ......అని పిలుద్దామే అన్నాడట ,అలా నా ముద్దు పేరు నాకు స్థిరమయ్యి ఇంట్లో అందరి నోళ్ళలో కొందరు దగ్గరి భందువులలో ప్రాచుర్యమయ్యింది.ఎంచక్కగా బుజ్జి ,చంటి చిన్ని చిన్నారి వుండగా ఇదే మీకు దొరికిందా అని ఇప్పటికి నా నుండి మా అమ్మ రెండు మూడు నెలలకోసారి యుద్ధం చూస్తుంది ,ముఖ్యంగా ఎవరైనా స్నేహితులో చుట్టాలో వచ్చి వెళ్ళాక .....వాళ్ళ ముందు నన్ను పిలిచినప్పుడు నాకేమో ఇబ్బందిగా వుంటాది .
మా అక్క మరీను ,తనతో బయటికి వెళ్తే అక్కడ ఎవరున్నా పట్టించుకోదు గట్టిగ పిలుస్తుంది ,ఒకటి రెండుసార్లు మా ఆఫీసు కి వచ్చినప్పుడు మా స్టాఫ్ ముందు నా ముద్దుపేరుతో పిలిచింది ,అదేమంటే ఇంకా కొత్తగా ఏం పేరు పెట్టి పిలవాలే నిన్ను అంటుంది.తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్క అనటానికి ముందు నా పెట్ నేమ్ తగిలించి మరీ అంటారు
మా అమ్మాయి, వాళ్ళ నాన్న కూడా నన్ను ఏడ్పించాలంటే అదే పిలుపు .
ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు అంటే సాయంత్రం మా నాన్నగారు ఎవరో స్నేహితులు వస్తే పరిచయం చేయడానికి నా పేరును గట్టిగ పిలిచి మా రెండో అమ్మాయండీ పలానాపలానా అని నా గురించి పరిచయం చేస్తుంటే అక్కడ ఏడవలేని వెర్రి నవ్వు ఒకటి నవ్వి మళ్లీమా అమ్మతో ఫైటింగ్ చేసోచ్చాను ...మన బ్లాగ్ లోకంలో ఎవరో నా పెట్ నేమ్ తో తెగ రాసేస్తున్నారు :)

21, సెప్టెంబర్ 2009, సోమవారం

"నా కవిత్వం"


వారం నుంచి బోల్డంత తీరికగా వున్నాను ...ఏదో మద్యలో ఒకటి రెండురోజులు తప్పించి .....ఇష్టం వచ్చినప్పుడు లేవడం ...నిద్రపోవడం పుస్తకాలు చదువుకుంటూ ...బ్లాగ్లు చదువుకుంటూ ...పాటలు వింటూ...కబుర్లు చెప్పుకుంటూ ....గంటలు గంటలు ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడిపేస్తున్నాను...
ఇంత చేస్తున్న ఇంకా చేయాల్సిన పనులు మిగిలున్నాయని చక్కగా పేపర్ ,పెన్ను పట్టుకుని ఒక కథ రాద్దాం అని కూర్చున్న ....ఏదో రాసాగాని రెండోసారి చదువుకుంటే నీరసంగా అనిపించింది ...సర్లేమ్మని దాన్ని ప్రక్కన పడేసా ...నా పాత డైరీ ఒకటి తీసుకున్న ...అప్పుడెప్పుడో నేను రాసుకున్న కవితలు ......హమ్మ్...అబ్బో "మరువం " ఉషగారు రాసిన కవితలతో పోటీ పడుతున్నాయి ...అన్ని తిరగేసి చదివి మురుసుకున్న....మచ్చుకి మీకొకటి ఇందులో పెడతాను ....ఓపిక వుంటే చూడండీ ....ముఖ్యంగా బ్లాగ్లలో వున్నా కవిత మహులందరికోసం............ఎంత ఓపిగ్గా రాసానో ....
...
రేగినకోరికలతో ...... గాలులు వీచగా
జీవన వేణువులలో ..... మోహన పాడగా
దూరము లేనిదై .....లోకము తోచగా
కాలము లేనిదై ...గగనము అందగా
సూరీడేఒదిగి ఒదిగి ...జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే ...నిదుర లేచే ప్రణయ గీతికి
ఒంటరి బాటసారి... జంటకు చేరగా
కంటికి పాపవైతే ...రెప్పగా మారనా
తూరుపు నీవుగా.... వేకువ నేనుగా
అల్లిక పాటగా ........పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులోకటై ...పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకు
ఓం నమః నయనశ్రుతులకు ఓం నమః హృదయలయలకు ఓం
ఓం నమః అధర జతులకుఓం నమః మధుర స్మృతులకుఓం
నీ హృదయం తపన తెలిసి,నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలోకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో.......................


ఇదండీ నాకు చాల ఇష్టమైన లిరిక్ ....గీతాంజలిలో మా నాగ్ అధ్బుతంగా లీనమయ్యి నటించేసాడు ....
ఎంత బాగా రాసుకున్నానో కదా .....ఎన్ని సార్లు విన్న విసుగు అనిపించదు ..... విని విని కాపీ చేసుకున్న ......నా కవిత .......-:)


20, సెప్టెంబర్ 2009, ఆదివారం

"అమ్మ పిలిచింది"


మనకు భక్తి చాలా తక్కువ,కొన్ని పరిస్థితులవల్ల అలా తయారయ్యి వుండొచ్చు.ఒక్క షిర్డీ బాబానే గురువుగా భగవంతుని దూతగా నివేధించుకుంటాను...మనసులోనే మాట్లాడుకుంటాను.యెంతఅవకాశం వున్నా గుడులు గోపురాలు తిరగడం తక్కువఒకవేళ వెళ్ళిన అక్కడ ప్రాచిన శిల్పసంపద ,చారిత్రిక ప్రాశస్త్యం చూస్తానుఅలా అని నాస్తికరాల్ని కాదు....ఏమో నాకు నేనే అర్ధం కాను ...:(
ఒక ప్రక్క తిరుపతిలో బ్రహ్మొస్థవాలు ఇంకో ప్రక్క కనకదుర్గమ్మ శరవన్నవరాత్రులు,విద్యాలయాలకు సెలవులు ఎటుచూసినా"భక్త జనం ".....రాష్ట్రమంతా స్వైన్ ఫ్లూ భయం ....జాగ్రత్తలూ .
ఉదయాన్నే పేపర్ చూస్తూ "వీళ్ళకి ఇంత భక్తేంటి,పూజారులు భక్తులు వ్యాధి నుండి రక్షణ కొరకు మాస్క్ లు తగిలించుకొని ఇంత రిస్క్ తీసుకోపోతే యేం?" నేను .
"ఆ విలువ,భక్తి భక్తులకు తెలుసుఇటువంటివి ఏమి ఖాతరు చెయ్యరు " శ్రీవారు.
"ఇప్పుడే వెళ్లి దర్శనం చేసుకోవాలా ?..తోసుకుంటూ నానా కష్టాలు పడి పిచ్చిజనం " నేను .
"అది వారి ఆనందం ,వారి భక్తి కి కష్టం తెలిదు " మా పాప.
పేపర్ చదువుతూ టీ ముగించాను ....ఇంతలో ఫోన్ కాల్ సారాంశం గంటలో oka దగ్గర అరగంటలో హాజరు వేసుకుని వారు వెళ్ళేవరకు మనం vundaali .ఒక అయిదునిమిషాలు ముందే అటెండెన్స్ వేసుకున్నాను "అతి వినయంగా"....araganta taruvatha ........


కిటకిటలాడే జనసందోహం లో ఇంద్రకీలాద్రి మలుపులు తిరుగుతూ......ప్రక్కనే నిండు "కృష్ణ వేణి "సోయగాలు చూస్తూ తన్మయినైన నేను అమ్మ వారి అంతరాలయం లో ప్రవేశించగానే అమ్మ నవ్విన నవ్వు చూసి ఉలిక్కిపడ్డాను. .......ఏమన్నావు ప్రొద్దుటే ?చిలిపిగా ప్రశ్నించింది అమ్మ .
"నేనా!" తడుముకున్నాను .
ఎందుకొచ్చావు ?ఇంకా నవ్వుతు కళ్ళు ఇంత చేసి మరి .
నేనేమి రాలేదు.....అర్ధం అయ్యిందిలే ...."అమ్మ నువ్వు పిలిచావు "గడుసుగా నవ్వుకుంటూహారతి కళ్ళకి అద్దుకుంటూ బయటికి వచ్చేశాను ......

12, సెప్టెంబర్ 2009, శనివారం

సెంట్రల్ యునివర్సిటీలో 'ఓనం'

ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ లో కేరళ వాళ్ళ ఫెస్టివల్ "ఓనం " జరుగుతుందట.అది విన్న దగ్గరనుంచి మనస్సు అటు పరుగులు తీస్తుంది .మినీ సైజే ప్రపంచం లా వుండే ఆ యునివర్సిటీ అంటే నాకు చాల ఇష్టం.భాగ్యనగరం వాతావరణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా ఒకింత చిట్టడవి ని తలపించేట్లు వుండేది ,బహుశా ఇప్పుడేమైనా మారి వుండొచ్చు .రుతువులకు అనుగుణంగా రంగులు మార్చుకుంటూ యే కాలానికి ఆ కాలం సొగసులద్దుకుంటూ స్వాగతం పలుకుతుంటది.
శీతాకాలం మంచుతెరల్లో చలికి వణుకుతూ చెట్లమద్య ఒంటరిగా నడిచే ఆనందం ...వర్ణించ తరమ!...అప్రయత్నంగా మనసులో "ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై "పాడేసుకుంటూతెలీని ప్రపంచం లోకి వెళ్ళిపోవాలని అన్పిస్తుంది .
వర్షాకాలం లో చిన్న చిన్న తుంపర్లలో తడుచుకుంటూ కనబడిన అడవి జాజిపూలను అందినకొద్దీ గుప్పెల్ల దొరకబుచ్చుకుని సన్నటి ఇరుకు దారిలో నెమళ్లసరస్సు చేరి కనబడిన రాతి గుట్టపై చేరబడి కనబడని నెమళ్ల కోసం వేచిచుడడంలో ఆనందం మళ్లీరాదేమో ...
వేసవి ఉషోదయాలు ,సాయంత్రం సంధ్యా సమయాలు ఎర్రటి అగ్నిపూలతో,పసుపుపూలతో గమ్మతైన పూల పరిమళంతో మనస్సును ఆహ్లాద పరుస్తుంది .
అన్నిటికి మించి ఎల్లలు ఎరగని ఆ స్నేహం లో,ఒక్కసారి అందులో అడుగు పెట్టాక అక్కడున్న ప్రతి చెట్టుతో పుట్ట తో మన అనుభందాన్ని తెంచుకోలేక ,గుర్తొస్తే మనస్సు చిలుకై అక్కడ చెట్టు మీద వాలుతుంది.
నేను ఈ పోస్ట్ రాసే సమయానికి మనవాళ్ళు పదిహేను రకాల కేరళ వంటలతో విందారగిస్తున్నారు....-:)

5, సెప్టెంబర్ 2009, శనివారం

అహం

మీరు నిరంతరం ఇతరులను తక్కువ చేయడం ద్వారా
మిమ్మల్ని మీరు అధికులుగా అనుకుంటూ ఉంటారు .
ఇదే అహంకారానికి మూల కారణం .
ఆత్మా గౌరవంలో పోలిక ఉండదు
ఆత్మా గౌరవంతో నీవు ఇతరుల గురించి ప్రస్తావించవు
అది కేవలం నాకు నేను గౌరవనీయున్ని ,నన్ను నేను
ప్రేమిస్తాను ,నేను ఇలా వున్నందుకే గర్వంగా ఉంటాను .
ఈ అందమైన సృష్టిలో వుండటమే నాకు గర్వకారణం,
అని చెప్తావు ...నీవు పోల్చడం ఎప్పుడైతే మొదలు పెడతావో ,
అపుడే అది అసహ్యకరమైన ఆటగా మొదలవుతుంది .

పైన రాసిన వాక్యాలు చాల ఇష్టమైనవి ...ప్రాక్టీసు చేయడానికి ప్రయత్నిస్తున్న .....(..ఓషో రచనలనుంచి తీసుకున్నవి ).

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

''ఒక్క క్షణం ఆలోచించండి ''

సాటి స్త్రీగా ఒక్క క్షణం ఆలోచించలేమా ?...ప్రకృతి పరంగాచూస్తె "స్త్రీ " ఎంత ఆకాశంలో సగమైన భేలయే...తన శారీరక నిర్మాణంలో కాని,మానసికంగా కాని పురుషుని తో పోల్చితే చాల "సున్నితమైనది ".పురుషునితో సమానంగా అన్నిరంగాల్లోను పనిచేయవచ్చుకాని సహజంగా సంక్రమించిన తనదైన లక్షణాలను దాచుకోలేదు. యెధైనవిపత్కర సమయంలోపురుషుని మాదిరి గంబీరత తో ఎదుర్కొనలేదు తన హావభావాలను అదుపు చేసుకోవటానికి చాల కష్టపడవలసి వస్తుంది .కదిపితే కన్నీటి పర్యంతమవుతుంది.ఎక్కడో తప్పించి అదీ అబ్నొర్మల్ స్త్రీ లోనే ఇందుకు విరుద్దంగా జరుగుతుంది..అంతవరకు ఎందుకు జీవితంలో ఎన్నో ఆటు -పోటులను ఎదుర్కున్న,కరడుకట్టినట్లు కనబడే 'సోనియా ' కంట నీరు చూడలేదా?
రాఖిల లకే పరిమితమైన చేవెళ్ళచెల్లెమ్మ నోరు విప్పకపోవడం లో ఆశ్చర్యం లేదు .భర్తమరణం వరకు గడప దాటని ఆ ఇల్లాలు అనుకోకుండా తనను వరించిన ఆ పదవుల్లో ఇమడడానికి ఇంకా సమయం కావాలేమో ?తనని నమ్మి ఎంపిక చేసుకున్న ప్రజల సమస్యలు తీర్చడానికి పూర్తి నిభద్దతాతో,ఎక్కడ బేషజం లేకుండా జీవితంలో తను పోగొట్టుకున్న "ఆనందం ''తాలుక విషాదం ని అంతా కళ్ళ లో నింపుకుని అలుపెరుగక పనిచేసే ఈ అమ్మ ని విమర్శించే ముందు ఒక్క క్షణం ఆలోచించాలేమో ......
మొన్న సాయంత్రం మొట్టమొదట ఏర్పాటు చేసిన సమావేశంలో కాస్తంత నిశితంగా పరిశీలించి చూస్తె తెలిసేది ...అప్పటికే జరిగిన పరిస్థితికి ఒక నిర్ణయానికి వచ్చిన ఆంద్రప్రభుత్వం ,కేంద్రప్రభుత్వం ప్రజాపాలన దృష్ట్యా విషయాన్ని ప్రజలు మానసికంగా అంగీకరించేంత స్తాయికి తీసుకురావడానికి తమలోని దుఖాన్ని దిగమింగుకునిమాట్లాడిన తీరు ....చీఫ్ సెక్రటరీ రమాకాంతరెడ్డి మాట్లాడిన తీరు .....
రాజకీయాల్లో కాని ,వయస్సు రీత్యకాని పెద్దవాడు ఆర్ధికశాఖ మంత్రి రోశయ్య మాట్లాడటం "అభ్యంతరకరమైన "విషయం కాదనుకుంటాను .అక్కడ పదవులు కాదు ముఖ్యం,పరిస్థితిని ఎదుర్కొనడం.....
మన హోం మినిష్టర్ ఆర్ధికంగా కలిగిన కుటుంబం నుంచి వచ్చారు,దివంగతుడైన ఆమె భర్త రాజకీయ ప్రస్తానం చేసినోడే ...సహజంగా వారి కట్టు బొట్టు వారికి తగ్గట్లుగానే వుంటుంది ...సమయాను సందర్భంగా అప్పటికప్పుడు వెదికి తక్కువ ఖరీదు దుస్తులు ధరించలేరేమో ?..ఆమె అలంకరణ ఎప్పుడు హుందాగా వయస్సుకు తగ్గట్లు పొందికగా వుండటమే చూసాను ....మిగిలిన కొంతమందిలా అసహజ అలంకరణ ,వయసుకు తగని అలంకరణ ఇంతవరకు చూడలేదు ..ఆమెలో చక్కని "స్త్రీ " చూసాను ....చూస్తున్నాను .

పైన ఇలా రాస్తున్నానని నన్నొక స్త్రీ వాదిగా చూడకండి ....నేను యేవాధిని కాదు అని చెప్పగలను కాని "మానవతావాదిని "మాత్రం కాదు అని చెప్పలేను ....ఇది రాసే సమయం కాదు ..అయిన రాయకుండా వుండలేను ...ఎవరికైనా అనుభవం వచ్చే కొద్ది సమర్ధతతో పనిచేస్తారుఇంకా మూడు నెలలెనాయే....అత్యంత భిడియస్తుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ,ఇందిరాగాంధీ యావత్ భారత దేశానికే నేతృత్వం వహించలేదా ?......practice makes men perfect ......

3, సెప్టెంబర్ 2009, గురువారం

"రాలిన మణి పూస"

మా కాలేజి పూర్వ విద్యార్ధి సంఘమనే ముత్యాల హారం నుండి ఒక 'మణిపూస'జారిపోయింది......ఎక్కడ పడిందోననిఇరవయ్యి నాలుగు గంటలు గాలించగా .....దొరికింది .......ఎక్కడో తెలుసా గగనం లో చమక్కున మెరిసేటి ఓ 'తార 'గా...........మీరు చూస్తారా .......ఎంత వెలుగులు చిమ్ముతూ ప్రకాశిస్తుందో ......రాజసం తో దర్పంగా ......
నిన్ను మరువగలమా......! .

అశ్రునివాళి

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ,స్పెషల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం ,సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ ఇద్దరి పైలేటేస్ లకు ఆత్మశాంతి కలగాలని ,కుటుంబ సభ్యులంతా త్వరలో కోలుకోవాలని కోరుకుంటూ .....