27, డిసెంబర్ 2009, ఆదివారం

అట్లపిండి

నా చిన్నతనం లో మాకు ఒక నాయనమ్మ వుండేది .ఆమె పేరు వెర్రి బామ్మ ,కాని అట్లు బహు ప్రశస్తంగా వొండేది .ఆవిడ చేస్తే ఇంతవరకు ఒక్కసారిగా ,పాతికట్లకంటే తక్కువ తిన్నాడు లేడుమాలో. ఆమెని అట్లబామ్మా అనే వాళ్ళం .ఎల్లా చేసేదో ఆ పిండి లో 'ఏం కలిపేదో ' ఎవరికి తెలియదు .ఒకసారి నేను మా చేల్లిలి గారి ఊరు వెళ్తున్న,మా చెల్లెలు గర్భిణి తో వుంది బామ్మ అట్లు తినాలని వుందని ఉత్తరాలు రాస్తోంది ,బామ్మ ఏం చేసిందంటే ,పిండి కలిపి ,ఒక పెద్ద సత్తేప్పాల లో వేసిసిబ్బి బోర్లించి ,గుడ్డ వాసిన కట్టి ,నన్ను ముందు తీసికెళ్ళమంది .మరునాడు రైల్ కి తను వస్తానంది .....
తరువాత కథ మీకు మీరు చదివితేనే అద్భుతంగ వుంటుంది .ఈ కథ ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుంది .నేనైతే బాగా ఎంజాయ్ చేసాను .చదివిన ప్రతిసారి నవ్వించక మానదు .పిండి గిన్నె పట్టుకుని రైలు ప్రయాణం దిగినాక పాట్లు ...సో నేను చెప్పేకంటే మీరు చదవడం బాగుంటుంది .
సరికాని ఎవరు రాసింది తల్లీ అంటారా?
ఇంకెవరు మన గుడిపాటి వెంకటచలం -:)
హ్మం !చలం అంటే ఒక్కసారే ఉలిక్కిపడ్డారా ?
నిజంగా చలం గారి రచనేనండీ ...అయన కథలనగానే స్త్రీ వాదం అనేస్కుంటారని నొక్కి వక్కాణిస్తున్న -:)
కథ పేరు "అట్లపిండి ".చలం గారి రచనలు చదివేవారు చదివే వుంటారు .ఈ కథ కావాలనుకుంటే సులువుగా దొరికే మార్గం చెబుతాను వినండి . సాకం నాగరాజ అద్వర్యంలో సంకలనం చేసిన "తెలుగు కథకి జేజే !" పుస్తకంలో పొందుపరచిన మొదటి కథే "అట్లపిండి "..ఈ పుస్తకం రెండువేల ఏడు లో ప్రచురించబడినది .వెల మూడు వందల రూపాయలు మాత్రమె .విశాలాంద్ర అన్ని బ్రాంచిల్లో దొరుకుతుంది .
నేను మాత్రం కొనలేదు -:) నా కొలీగు ( నా ఒకప్పటి మిత్రురాలు )నా పుట్టినరోజుకి బహుమతిగా పంపించారు .తోచక పుస్తక ప్రక్షాళన చేస్తుంటే కంటబడింది ,చదవవలసిన మంచి పుస్తకం అని మీతో పంచుకుంటున్న

23, డిసెంబర్ 2009, బుధవారం

మరచిపోలేని కథ

  1. డిసెంబర్ ఇరవయ్యిఆరు రెండువేల తొమ్మిది నాటికి మన దేశాన్ని సునామి తాకి సరిగ్గా అయిదు సంవత్సరాలు అవుతుంది .ఆనాటి ప్రకృతి ప్రళయాన్ని కళ్ళకి కట్టినట్లు రాసిన కథ "కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం".ఈ కథ రెండు వేల అయిదు జనవరి పదహారు 'ఆంధ్రజ్యోతి 'ఆదివారం అనుభంధం లో ప్రచురించబడింది . ఈకథ ఉత్తమ కథ గా "కథరెండువేల అయిదులో " చోటు చేసుకుంది పైన ఆకాశం ,కింద భూమి ,చుట్టూ నీరు .భూమి బద్దలైనపుడో ,నీరు ఉప్పొంగినపుడో మనిషి కాళ్ళ కింద నేలకరిగిపోతుంది .నమ్మినవాళ్ళు ,నమ్ముకొన్న ప్రపంచం ఆనవాళ్ళు అన్ని క్షణాల్లో చెదిరిపోయినపుడు,విశాలాకాశం కింద ఒంటరిగా నిలబడ్డప్పుడు జీవితానికి అర్ధం ఏవిటనే ప్రశ్న ముందుకొస్తుంది .మనుషుల మద్య నిరంతరం ఉండే సవాలక్ష అంతరాలు అర్ధం లేనివని అవగాహన ముందుకొస్తుంది . ప్రతి వాక్యము రచయిత అక్కడ వీక్షించి లేక ఆ స్థితిని అనుభవించి రాసారా అన్న ప్రశ్న మన మస్తిష్కం లో రేగుతుంది . కథ చదివి పొగిలి పొగిలి ఎడ్వటమే కాక మా ఇంటిల్లిపాది చదివించి ఎడ్పించాను. రచయితని ప్రత్యక్షంగా ఒక సమావేశం లో కలిసినపుడు నేను అడిగిన ప్రశ్న మీ సన్నిహితులకథ రాసారా అని .ఈ రోజు ఈ కథను గూర్చి ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడానికి కారణం కల్పన గారు వారి బ్లాగ్ లో ఈ కథ గురించి ప్రస్తావించారు .నేను మరచిపోలేని మరువరాని కథ ఇది ,ఎవరైనా చదవని వారుంటే చూస్తారనే ఉద్దేశముతో పరిచయం చేస్తున్నాను .రచయిత శ్రీ చోరగుడి జాన్సన్ గారు .వీరు సమాచార పౌర సంభందాల శాఖలో డిప్యుటీ డైరక్టర్ గా పనిచేస్తున్నారు .వీరు కథలు వ్యాసాలూ సమీక్షలు తరుచు రాస్తుంటారు .ఈ కథ సంకలనం అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో దొరకవచ్చును .
j

16, డిసెంబర్ 2009, బుధవారం

కళామాత ముద్దుబిడ్డలు

ఇప్పటివరకు సమైక్య ఉద్యమానికి కాని తెలంగాణా ఉద్యమానికికాని యువతే స్పూర్తిదాయకంగా నిలబడి తమ చదువులు ప్రాణాలు సైతం లెక్కచేయక కదం తొక్కుతున్నారు,వీరంతా రాజకీయ నాయకులకి భలంగా వున్నరనడం లో ఎటువంటి సందేహం లేదు .అన్ని వర్గాలు ,స్త్రీలు పురుషులు ,వ్యాపారులు ఉద్యోగులు సైతం ఉద్యమానికి ఊతం ఇస్తున్నారు .ఉద్యోగులు పెన్ డౌన్ చేసి తమ నిరసన తెలియచేస్తున్నారు .ఇంత జరుగుతున్న ఒక వర్గం మాత్రం స్పందించడం లేదు .ఎన్నికలప్పుడు ,విపత్కర పరిస్తితులప్పుడు హంగామా చేసే వీరు ఏమైపోయారు ...వారిని ఎవరైనా ఆపుతున్నారా? వీరికున్న మాస్స్ ఫాల్లయింగ్ వేరేవారికి ఉండదే ?వారికి ఏమి వద్దా ? ముఖ్యంగా కోస్తాజిల్లాల నుండి వెళ్ళిన ఈ కళామాత ముద్దు బిడ్డలు ఏమయ్యారో ?గళం ఎత్తి గానం చేస్తున్నా వినబడటం లేదే ?

14, డిసెంబర్ 2009, సోమవారం

ఇది మా సత్తా

నిద్రపోతున్న సింహాలను నిద్రలేపారు .....బ్రేవో బ్రదేర్స్!
సమైక్య గీతం ఆలపించుదాం అలుపెరుగని ఉత్సాహంతో

10, డిసెంబర్ 2009, గురువారం

"మేము ఎవ్వరికీ వద్దంటా"

అటేమో తెలంగాణాహైదరాబాద్ తో సహా అధిష్టానం ఇచ్చేస్తుంటే 'రాయలసీమోళ్ళు'నెల్లూరు ప్రకాశం కలిపి ప్రత్యేకం కావాలట ,మరిటేమోఉత్తరాంద్ర వాళ్లకు ఉభయగోదావరి జిల్లాలతో ప్రత్యేకం రాష్ట్రం కావాలట ,మరి మిగిలిపోయింది కృష్ణా గుంటూర్ వాళ్ళే .మేము ఎవరికి అక్కర్లేదంట-:)ఎట్టగబ్బ!

6, డిసెంబర్ 2009, ఆదివారం

కొత్తపాళీ పుస్తకావిష్కరణ "రంగుటద్దాల కిటికీ " ఎలా జరిగిందంటే .....

బ్లాగ్ లో కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ ఆహ్వానం చూసి వెళ్లాలని ముచ్చటపడ్డాను,అనుకున్నాను అంటే కచ్చితంగా అయ్యి తీరాల్సిందే .నా మిత్రుల్ని అడిగాను వస్తారేమోనని కాని తనకి వీలుపడలేదు .సరే ఒక్కదాన్నే వెళ్ళటమా అని ఆలోచించే లోపు మా పాప ,చెల్లి పాప నాతో దగ్గరలో వున్నా లేపాక్షి ఎక్సిబిషన్ చూస్తానంటూ నా వెనుక పిల్లి పిల్లల్లా వచ్చారు.మొత్తానికి వెదుక్కుంటూ స్వాతంత్ర సమరయోధుల భవనం పట్టుకున్నాం కచ్చితంగా ఐదు గంటల పది నిమిషాలకి అక్కడ చేరాను అక్కడే నాకో మిత్రురాలు కలిసారు పైన సభా కార్యక్రమాలు మొదలు కాలేదని చెప్పారు ,క్రింద సమరయోధులు శ్రీ వామనరావు,పట్టాభి పిచ్చాపాటి కబుర్లలో వున్నారు ,వాళ్ళ కబుర్లు వింటూ మేము కాసేపు గడిపాక కార్యక్రమం మొదలవ్వబోతుంది అని కబురోచ్చాక పైకి వెళ్ళగానే మెట్ల మీదే గుమ్మా సాంబ శివరావు గారు ,ఆచార్య సిమ్మన్న గారు ,పూర్ణచంద్ గారు ఇంకొంత మంది రచయితలూ కనబడిపలకరింపులు నవ్వులు పువ్వులు తో కొంతసేపు కబుర్లతో గడిపాము , కొత్తపాళీ గారు బిజీగా పుస్తకాలు సర్దుకుంటున్నారు ఆయనను నెట్ లో చూడటం వలన గుర్తుపట్టాను.మొత్తానికి అనుకున్న సమయంకంటే ఒకింత ఆలస్యంగా ప్రారంభం అయ్యింది .
మొదట పుస్తకావిష్కరణ జరిపాక అతిధులు పుస్తకం గురించి పరిచయం చేసారు ,వంశి కృష్ణ గారు చాలా వివరంగా క్లుప్తంగా చాల చక్కగా చెప్పారు ,సత్యవతిగారు చేసిన పరిచయం ఆకట్టుకోలేదు .స్పెషల్ గ్రేడ్ డిప్యుటీకలెక్టర్ ముఖ్య అతిధిగా వచ్చిన చెప్పిన రెండు ముక్కలు వినదగినట్లే వున్నాయి గంట పైన సాగిన ఈ కార్యక్రమానికి చాల మంది రచయితలూ పత్రికాధిపతులు వచ్చారు ,సాధారణంగా ఇటువంటి సమావేశాలకు తక్కువమంది వస్తుంటారు ,అదే సమయంలో తుమ్మలపల్లి కళా క్షేత్రం లో ఘంటసాల విగ్రహావిష్కరణ వున్నా ఇక్కడ చూసుకుని అటు వెళ్ళిన వారు వున్నారు..సభ నిండుగానే వుందని చెప్పొచ్చు .
చివరిగా కొత్తపాళిగారు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేసారు .ఒకరు చెన్నై నుండి వచ్చిన భైరవబట్ల కామేశ్వర రావు గారు,ఇంకొకరుఎస్ .అర్ర్ .రావు గారు,విజయవాడ...అంత దూరం నుండి వచ్చిన కామేశ్వరరావు గార్ని చూస్తె ముచ్చట అన్పించింది .
కొత్తపాళిగారు తన సంతకం తో కూడిన పుస్తకం విచ్చేసిన అతిదులందరికి బహుకరించారు ,పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ వందన సమర్పణ చేసారు,తరువాత ఇష్టాగోష్టి అన్నారు కాని నాకూడా పిల్లిపిల్లలు క్రింద ఎదురుచూస్తూ ఫోన్స్ మీద ఫోన్ చేయడం వలన నేను చివరివరకు ఉండలేకపోయాను...కొత్తపాళీ గారి దగ్గరికి వెళ్లి పుస్తకం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పి నాఅసలు పేరు తో పరిచయం చేసుకున్నాను.అన్నట్లు ఎక్కడో మూల నవ్వులాట శ్రీకాంత్ గార్ని చూసాను.....ఇంతకి కొత్తపాళీ గారికి నేనెవరో చెప్పలేదు .-:)

4, డిసెంబర్ 2009, శుక్రవారం

వన్నె తగ్గిన"వంశి" కథలు

'పసలపూడి కథలు'నాకు చాల ఇష్టం .చాలావరకు వంశి కథలు మిస్ కాను .చదువుతున్నంతసేపు అక్కడ విహరింప చేసేట్లుంటాయి అతని కథలు .వంశి కథలు యెంతఇష్టం అంటే రావులపాలెం మీదనుండి కాకినాడ వెళ్తుంటే 'పసలపూడి 'దగ్గర కార్ ఆపేసి వంశి రాసినవన్నీ తలుచుకుంటూ ...ఈ వంతెన మీద కాలక్షేపం చేసుంటారు ,ఇక్కడ హోటల్లో పుల్లట్లు తిని ఉంటాడు అని సరదాగా ,ఒకింత అభిమానం తో తలుచుకునే దాన్ని..
ఇటీవల వంశి కి ఏమైందో అర్ధం కావడం లేదు తన రాతల్లో చాల మార్పు వచ్చింది ..స్వాతిలో తన కథలు 'మాదిగువ గోదావరి కథలు ' పేరిట వస్తున్నాయి ..చాలవరకి నాణ్యత లోపించి ఉంటున్నాయి.ఈరోజు స్వాతి లో తను రాసిన కథ చదివితే నిజంగా వంశి రాసిందేనా అన్న సందేహం వచ్చింది.తన భాష ప్రయోగం ప్చ్...పోయిన వారం నా మిత్రునితో ఇదే విషయం చర్చకి వచ్చినపుడు తను కూడా విచారం వ్యక్తం చేసాడు ..దిగువ గోదావరి కథలు చదవడమే మానేసానని చెప్పాడు ...'ఇప్పుడే వస్తానందిశకుంతల'రచయితా స్వానుభవం , ఇదే ఒకప్పుడైతే చాల చక్కగా అల్లి మనల్ని అక్కడికి తీసుకెళ్ళి పోయేవారు ..కాని ఇప్పుడు ?బహుశ మనస్సు పెట్టి రాయడం లేదో లేక తన పేరుతో వేరెవరైనా రాస్తున్నారా అన్న సందేహం పొడసూపక మానదు ..ఏమైనా వంశి ఆలోచించాల్సిన విషయమే .