ఇష్టం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇష్టం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జులై 2011, ఆదివారం

చరిత్ర ఇష్టం

బ్రిటిషు పాలకులు తమకోసం నిర్మించు కున్న ఆ భవనం హుందాగా చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడి వుంటుంది .రైలింగ్ పట్టుకుని టకటక మని చప్పుడు చేసుకుంటూ ఆ మెట్లు ఎక్కి దిగుతున్న ప్రతిసారి నా మనస్సు చరిత్రలోకి పరిగెడుతుంది .ఎప్పుడో బ్రిటీషువారు కట్టిన ఆ భవనంలో జిల్లా ముఖ్యాధికారి కొలువు వుంటుంది ,కొండరాళ్ళ తో చెక్క మెట్ల తో చాలా పటిష్టంగా వుంటుంది .పనిమీద ఎప్పుడు వెళ్ళిన నా మనస్సు వెళ్ళిన పని నుండి మరలి చరిత్రలోకి పరిగెడుతుంది .

చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం .నేటి కథేగా రేపటి చరిత్ర!చరిత్ర ఎందుకు చదవాలి అదేమైన కూడు పెడుతుందా ఈ రాజు ఎప్పుడు పుడితే ఏమి చస్తే ఏమి ఆ తేదీలు సంవత్సరాలు బాబోయ్ అంటారు చాలా అమాయకంగా :-)
నేను చరిత్ర చదవబట్టే అది నాకు కూడు పెడుతుంది ఆ సబ్జెక్టు మీద ఇష్టం ప్రేమ ఇంకా వగైరా వగైరా ఉండబట్టే కదా ఒక ఆప్షన్గా తీసుకుని మాక్సిమం స్కోరు తో వరుసగా రెండు మూడు ఉజ్జోగాలు సంపాదించాను :-)
సమావేశ మందిరంలో కూర్చున్న నా కళ్ళు నిశితంగా కూడ్యాలు దర్వాజాల వైపు చక్కర్లు కొడుతుంటాయి .అప్పుడెప్పుడో పందొమ్మిదివందల ఇరవయ్యో లో భాధ్యతలు నిర్వహించిన నోరు తిరగని అధికారుల పేర్లనుంచి ఇప్పటివరకు నిర్వహిస్తున్నవారివి చెక్క ఫ్రేం లో రాసి వున్నాయి చదుకుంటూ అప్పటిలో అక్కడ కొలువు చేసిన గతించిన అధికార్లను ఊహ రూపం లో చూస్తూ రేపటి మనల్ని చూస్తుంటాను .
పాలకులుగామౌర్యుల్ని గుప్తులని అల్లాఉద్దిన్ ఖిల్జీ ని అక్బర్నిషేర్ష సూరిని ఔరంగాజేబుని తుగ్లక్ ని శివాజీ ని కృష్ణదేవరాయని ఇంకా ముఖ్యంగా మనకి పాలన వ్యవస్థని అంచెలంచెలుగా అందించిన "బ్రిటిషు "వారిని ఇష్టపడతాను .బ్రిటిషువారి జ్ఞాపకాలుగా మిగిలిపోయిన (వదిలివెళ్ళిన )ఆ పూరాతన కట్టడాలు నాకెంతో ఇష్టం .

12, జనవరి 2011, బుధవారం

21, నవంబర్ 2010, ఆదివారం

నచ్చిమెచ్చినవి

4, నవంబర్ 2010, గురువారం

క్షమించు (మన్నిపాయ )

23, డిసెంబర్ 2009, బుధవారం

మరచిపోలేని కథ

  1. డిసెంబర్ ఇరవయ్యిఆరు రెండువేల తొమ్మిది నాటికి మన దేశాన్ని సునామి తాకి సరిగ్గా అయిదు సంవత్సరాలు అవుతుంది .ఆనాటి ప్రకృతి ప్రళయాన్ని కళ్ళకి కట్టినట్లు రాసిన కథ "కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం".ఈ కథ రెండు వేల అయిదు జనవరి పదహారు 'ఆంధ్రజ్యోతి 'ఆదివారం అనుభంధం లో ప్రచురించబడింది . ఈకథ ఉత్తమ కథ గా "కథరెండువేల అయిదులో " చోటు చేసుకుంది పైన ఆకాశం ,కింద భూమి ,చుట్టూ నీరు .భూమి బద్దలైనపుడో ,నీరు ఉప్పొంగినపుడో మనిషి కాళ్ళ కింద నేలకరిగిపోతుంది .నమ్మినవాళ్ళు ,నమ్ముకొన్న ప్రపంచం ఆనవాళ్ళు అన్ని క్షణాల్లో చెదిరిపోయినపుడు,విశాలాకాశం కింద ఒంటరిగా నిలబడ్డప్పుడు జీవితానికి అర్ధం ఏవిటనే ప్రశ్న ముందుకొస్తుంది .మనుషుల మద్య నిరంతరం ఉండే సవాలక్ష అంతరాలు అర్ధం లేనివని అవగాహన ముందుకొస్తుంది . ప్రతి వాక్యము రచయిత అక్కడ వీక్షించి లేక ఆ స్థితిని అనుభవించి రాసారా అన్న ప్రశ్న మన మస్తిష్కం లో రేగుతుంది . కథ చదివి పొగిలి పొగిలి ఎడ్వటమే కాక మా ఇంటిల్లిపాది చదివించి ఎడ్పించాను. రచయితని ప్రత్యక్షంగా ఒక సమావేశం లో కలిసినపుడు నేను అడిగిన ప్రశ్న మీ సన్నిహితులకథ రాసారా అని .ఈ రోజు ఈ కథను గూర్చి ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడానికి కారణం కల్పన గారు వారి బ్లాగ్ లో ఈ కథ గురించి ప్రస్తావించారు .నేను మరచిపోలేని మరువరాని కథ ఇది ,ఎవరైనా చదవని వారుంటే చూస్తారనే ఉద్దేశముతో పరిచయం చేస్తున్నాను .రచయిత శ్రీ చోరగుడి జాన్సన్ గారు .వీరు సమాచార పౌర సంభందాల శాఖలో డిప్యుటీ డైరక్టర్ గా పనిచేస్తున్నారు .వీరు కథలు వ్యాసాలూ సమీక్షలు తరుచు రాస్తుంటారు .ఈ కథ సంకలనం అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో దొరకవచ్చును .
j