అభినందనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అభినందనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జనవరి 2011, శనివారం

ఇపుడేవిరిసిన మా పిల్లలు













21, జూన్ 2009, ఆదివారం

మా నాన్న

ఈ రోజు ఉదయాన్నే పేపర్ తీయగానే కనిపించింది "మారిన నాన్న పాత్ర "....ఫాదర్స్ డే సంధర్భంగా రాసిన ఆర్టికల్ లలో ....నిజంగానే నాన్న లు మారారు ...ప్రపంచం మొత్తం ఒక్క కుగ్రామం అవ్వుతున్న తరుణం లో ..మార్పు స్పష్టంగా కనబడుతుంది ,మా అమ్మ నాన్న కి , మా నాన్న కి ,మా అమ్మాయి వాళ్ల నాన్నకి ఎంత దూరమో ..తరం తరం నిరంతరం "మార్పు "...కారణాలు ఎవైనా కావచ్చు ....మానవ సంభంధాలలో ఈ మార్పు స్వాగతించ దగ్గవే .
నా వ్యక్తిత్వం పై నాన్న ముద్ర చాల వుందనే చెప్పవచ్చు .రెండేళ్ళ వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుని తల్లి సంరక్షణలోనే పెరిగి ఎంతో ప్రయోజకుడై న మా నాన్న ,తన పిల్లలకు కే కాకుండా ఎంతో మంది పేద ,అనాధలకు ఆశ్రయం కల్పించి వారి వున్నతాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు .నేను బాగుండాలి నాతోటి వారు బాగుండాలి అనే సూత్రం నాయనమ్మ ఉగ్గుపాలతో పోసి నాన్న ను పెంచింది .చిన్న కుటుంబములో పెరిగిన నాన్న పెద్దయాక తన కుటుంబాన్ని పెంచుకున్నారు ,,,అందుకే మేము ఆరుగు పిల్లలం . నాన్న మాకు ఊహ తెలిసి ఎవర్ని కొట్టడం తెలిదు ..అస్సలు ఎంతో అల్లరి చేసే నేనే ఎప్పుడు దెబ్బలు తినలేదు ...కాని ఆయన వునికి చాలు ఆ పరిసరాలు నిశభ్ధం ఆవరించడానికి ..ఒక విధంగా అమ్మే మా దృష్టిలో నాన్న ను పులి ని చేసిందని చెప్పొచ్చు ..మాకు భయం వుండాలని నాన్న కి అది ఇష్టం వుండదు ,ఇది ఇష్టం వుండదు ,ఇలా చేస్తే కోపం వస్తుందీ అని చెప్పి మమ్మల్ని కంట్రోల్లో పెట్టిందని చెప్పొచ్చు.:)..
నాన్న ఇంట్లో పెద్దగా డామినేట్ చేసినట్లు కనబడినా నిజానికి అన్నింటా అమ్మ నిర్ణయానికే వదిలేసేవారు .తను చేసే ఉద్యోగాన్ని అంకిత భావంతో చేసేవారు.వృత్తి దైవంగా భావించేవారు ...నిజానికి ఆయన ఫ్యామిలీ తో గడిపే సమయం కన్నా ఉద్యోగం తో గడిపిన సమయం ఎక్కువ ,అయిన ఎక్కడ అలసట చెందకుండా ,విసుగు లేకుండా మాకే లోటు తెలీకుండా, మా అందరిని రాకుమార్తెల్లా పెంచారు ,ప్రేమానురాగాలు పంచారు . ఏడాదికి కి ఒక ఊరు తన కూడా తిప్పారు.మేము కాలేజి చదువుకి వచ్చాక పాపం తనే ఒంటరిగా తిరిగారు .
చదువు విషయం లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పుల గురించి వివరిస్తూ మాకు వాటి పట్ల ఆసక్తి కలిగేలా చేసిన ఘనత నాన్నదే .ఒక్క ఇంటినుండే ఒక్కసారే నలుగురు పిల్లలు సివిల్సేర్విసే మెయిన్ ఎగ్జామ్స్ రాసిన ఘనత మా నాన్న పిల్లలకే దక్కింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు .ఆరుగురికి మంచి మంచి చదువులు చెప్పించి తండ్రిగా తనవంతు భాద్యతను నిర్వర్తించారు .చదువొక్కటే కాదు లోకం అంటు పిల్లల అభిరుచికి తగ్గట్లు ప్రోత్సాహం ఇచ్చారు .మా ఇల్లోక చిన్న గ్రంధాలయం చేసి మాలో సాహిత్యాభిలాష పెంచారు .తన వృత్తి లో రాష్ట్ర స్థాయి ప్రతిభ పురస్కారాలు అందుకున్న మా నాన్న మాకు ఆదర్శంగా నిలిచారు .ఈరోజు మేము అందుకుంటున్న యోగ్యత పత్ర్రాలు మా నాన్న పెంచిన మొక్కలే కదా ...! ఇరవయ్యొకటో సంవత్సరం లో మా రెండో పాపను పోగొట్టుకుని పూర్తి డిప్రెషన్ లో వున్నా నన్ను ఓదార్చి ,ఇంటి ఆవరణలోని నిండు పూతతో వున్నా కొబ్బరి చెట్టుని చూపించి ,వాటికి వచ్చిన పూతంతా నిలవదుగా ,కొన్ని మాత్రమేగా పిందెలుగా మారి కాయలవ్వేది ....అని మరణం గురించి మాట్లాడి నాలో తాత్విక దృష్టి పెంచి ధ్యానం సాధనగా చేసుకుని తిరిగి భాహ్య ప్రపంచం లోకి రావడానికి చేయూతనిచ్చారు. నాన్న ఈ నాటికి వుద్యోగ విరమణ చేసి పదవ సంవత్సరం ,అరవయ్యి ఎనిమిది నిండి అరవయ్యితోమ్మిది జరుగుతున్న మా నాన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ,,,భావి తరానికి స్పూర్తిగా వుండాలని ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ.