స్వగతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్వగతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, అక్టోబర్ 2009, గురువారం

నేను -4

కళ్ళు తెరిచి చూసేసరికి నేనొక విశాలమైన ప్రాంగణం లో వున్నాను ఇక్కడ పక్షుల కిలకిలలు సెలయేటి గలగలలు లేవు .అంత రణగొణ ధ్వనులు,దుమ్ము ,రకరకలయిన మనిష్యులు వస్తుపోతున్నారు నన్ను తాకి ''నిఖార్సైన జాతి"అంటున్నారు .వారి మాటలు అర్ధం కాలేదు కాని ఒక్కటి మాత్రం తెలిసింది ,మేము పుట్టిపెరిగిన నేలమంచిదని నీరు మంచిదని వాటితో జాయలు వస్తాయని దాని వలెనే నా అందం ఇనుమడించిందని....
మా కోసం పోటీపడి పెద్దమొత్తం చెల్లించి సాయంత్రం వరకైనా అక్కడ వుండనీయలేదు.
అక్కడినుండి మరొక ప్రదేశానికి చేర్చారు ...నాకు ఒకటే ఆశ్చర్యం ,ఇంత చిన్న మానవుడు మమ్మల్ని ఎంత అవలీలగా తరలిస్తున్నాడో అని.బక్కచిక్కిన ఒక వ్యక్తి తన చేతిలో సరంజామా తో వచ్చి మమ్మల్ని చూసి అతని కళ్ళు మెరవగా ఆప్యాయంగా స్పృశించాడు ,అతని వెనుక వచ్చిన వారికి ఏదో పురమాయించాడు.నన్ను ప్రక్కకి తీసుకువచ్చి వారివద్దనున్న రంపాలతో అడ్డదిడ్డంగా నన్ను ముక్కలు ముక్కలు చేసారు,అదృష్టం నా గుండెను కోయలేదు...కోసినా భరించే శక్తి నాకొచ్చింది .ఆ నాటినుండి ఆ ముగ్గురు మమ్మొధలక దినారాత్రులు మాతోనే గడిపారు ,చెప్పొద్దు !నాకు ఆసక్తిగానే వుండేది వారేం చేస్తారా చూడాలనే .నా భాదని నా వారిని మరచిపోయి ఈ కొత్త ప్రపంచంలో పడిపోయాను ఆసక్తిగా చూస్తూ ..
మమ్మల్ని చూస్తే మాకే ఆశ్చర్యంగా వుండేది వారి చేతుల్లో నునుపుదనం సంతరించుకున్నాం ముట్టుకుంటేనే జారిపోయేట్టుతయారయ్యాం ,మాకు రకరకాలైన లేపనాలు అద్దేవారు నాజుకుదనం కోసం మిషనుల్లో పెట్టేవారు ..ఆ బక్కచిక్కిన వ్యక్తికి మేము ప్రాణం అని అర్ధం అయ్యింది ,ఎంత అందంగా చేసిన తృప్తి పడక ఇంకా మాకు మెరుగులు దిద్దేవాడు,ఎండ వానకి కూడా మేము తట్టుకుని నిలబడాలనే కోరిక వ్యక్తం చేసేవాడు

ఈ మానవుడు యెంతవిచిత్రమైన వాడు !స్వతః సిద్దంగా పూసిన పూలను కాయలను కర్కశంగా చిదిమి మరల పునః సృష్టిగావిస్తున్నాడు.నా బాధను మరపించుటకు నా పూలను నన్నే నమ్మి ఆశ్రయించిన పిట్టలను నాలోనే చెక్కాడు చూసి మరచిపోమ్మని
ఒక మద్యాహ్నం ఆదమరచి నిద్రలో వుండగా నా చెక్కిలిమీద వెచ్చని కన్నీటి బొట్లు నన్ను మలచిన ఆ శిల్పి కనులనుండి ,యేమి జరుగుతుందో చూసేలోపు నేను అక్కడినుండి తరలించబడ్డాను ,మనస్సు భాధతో ఒక్క క్షణం కలవరపడింది ,అయిన ఇలాటి అనుభందాలకి అతీతంగా తయారవ్వాలన్న నా సంకల్పాన్ని నిర్వీర్యం చేయదలుచుకోలేదు .
నేను క్రొత్తగా వచ్చిన ప్రదేశం చాల బాగుంది ..అందరు నాలానే మలిచిన వారేఅంతా నా జాతే ..ఒక్కొక్కరి అందం చూడటానికి కళ్ళు చాలడం లేదు ...యేమి హొయలు ! యేమి నిగారింపు లో ! ముసిముసి నవ్వులతో పలకరింపులు ,కుశలం ప్రశ్నలు ...అబ్బ నేను వెళ్లి గంటయిన కాలేదు ఎక్కడినుండో ముగ్గురబ్బాయిలు వచ్చి నన్ను నాతో మరో ఇద్దరినీ ఎంచుకుని మమ్మల్ని బయటికి తీసుకు వచ్చేశారు ,మమ్మల్ని చాల దూరం తీసుకెళ్లాలని వారిలో వారు అనుకుంటుంటే తెలిసింది ..మమ్మల్ని అపురూపంగా కట్టి చీకటి బండిలో పెట్టారు గాలి వెల్తురు లేక తెగ ఇబ్బంది పడ్డాను .నేను గమ్యం చేరేసరికి నాకోసం ఎదురుచూస్తూ అక్కడ చూసిన అందమయిన అబ్బాయి .నన్ను తనతో తీసికెళ్ళాడు ...ఓహో రేపటినుండి ఇతని తో వుంటాను కాబోలు అనుకునేలోపు ఒక ఇంటికి చేర్చాడు ..ఇంతకి నన్ను చేర్చింది చిన్ని అనే వాళ్ళింటికి ..స్నేహితులంతా కలసి మమ్మల్ని తెచ్చుకున్నారట ,చిన్ని రాలేదని చిన్ని తరుపున ఈ అబ్బాయి నన్ను ఎంపిక చేసాడు ...చిన్ని కి నేను చాల నచ్చానని అతని చెప్తుంటే విన్నాను

హమ్మయ్య ! ఇక్కడ రణగొణ ధ్వనులు లేవు ,ప్రశాంతం గా వుంది .అసలు వాకిట్లో అడుగుపెట్టగానే ఆశ్చర్యం ..ఆ వీధంతా నా వాళ్ళే ,పచ్చగా కళకళ లాడుతూ ..నగరాల్లో ఇలాటి వీధి నేను చూడలేదింత వరకు ..మా అడవిలోకి వచ్చానా అని క్షణం భ్రమపడ్డాను .ఆ చెట్ల మీద ఆడుకుంటున్న గోరింకలను చుస్తే మనస్సోక క్షణం కలుక్కుమంది.వరండాలో పరిసరాలు చూస్తూ నిట్టురుస్తూ నుంచున్న నన్ను నెమ్మదిగా ఎవరో వచ్చి ఇంట్లోకి చేర్చారు నిశబ్దం గా వున్నా ఆ ఇంట్లో మనుష్యులు వున్నారన్నట్లు తెలిసేది చిన్ని కాలి మువ్వల చప్పుళ్ళే.చిన్ని నన్ను అపురూపంగా చూస్తుంది .నా కోసం చిన్ని వాళ్ళ పాప గది ఇచ్చింది ,నేనోస్తానని నా ముందు వున్నవారిని వాళ్ళమ్మ వాళ్ళింట్లో బోల్డన్ని గదులున్నాయని అక్కడికి పంపేసింది .పెద్ద పెద్ద కితికిలకి వున్నా తెరలు తీస్తే మావాళ్ళంతనా కళ్ళ ముందు కనబడతారు .నా మీద మెత్తటి పరుపు వేసి తెల్ల పూల దుప్పటి వేసింది ...నిజం చెప్పోద్చు ..నన్ను చూస్తె నాకే ముద్దోచ్చాను ...చిన్ని ఇంట్లో వున్నప్పుడు నాతోనే ముచ్చట్లు ....ఈ రోజు ఆదమరచి నా మీదే వాలి నిద్రపోయింది ..చిన్ని ని చూస్తె నా గూటిలోని గువ్వపిల్లలు గుర్తొచ్చారు .....నా ఒడిలో నిశ్చింతగా ఆదమరచి నిదుర పోయిన తీరు .......బ్రతికిన మరణించినమేము సమస్త ప్రకృతిలోని జంతు జీవలకి వుపయోగ పడుతూనే వుంటాం .. ..మా సహజ లక్షణం.

నేను .......? చిన్ని ముచ్చటపడి తెచ్చుకున్న అందమయిన మంచాన్ని :):)

28, అక్టోబర్ 2009, బుధవారం

నేను -౩

యధాప్రకారం గువ్వలన్ని పిల్లల్ని నా మీద వదిలి గూడు విడిచి ఆహరాన్వేషణ కి వెళ్ళాయి .పిల్లలని గోలచేస్తూ ఆడుకుంటున్నాయి .నేను నా వాళ్ళు కబుర్లలో మునిగిపోయము .ఒక్కసారిగా మా అడివంత కలకలం రేగింది .స్వేచ్చగా తిరుగాడే జంతుజాలం కకావికలమై నలు దిక్కులు పరుగులు తీసాయి .గువ్వపిల్లలన్ని భీతి తో తల్లడిల్లి ముడుచుకుని గూటిలో దూరాయి ...పరికించి చుసిన వింత జంతువులు ...వారే మనుష్యులు .

నా దగ్గరకి వచ్చి ఆపాదమస్తకం పరికించి చూసారు,నా తనువునెల్ల తడిమి తడిమి చూసారు .అందరిలో భలిష్టమైన వ్యక్తి ముందుకు వచ్చి నా పై చేయి వేసాడు ...ఒక్కసారే ఉలిక్కిపడ్డాను,భయంతో తడబడిపోయాను,నా ఆకులన్ని జలజలమని రాలిపడ్డాయి,ఆ వ్యక్తి సంతృప్తిగా ప్రక్కని వారితో ఏదో చెప్పాడు .నాకు అయోమయంగానూ,ఆనందం గాను వుండి నా సన్నిహితులవైపు గర్వంగా చూసాను .వారు నావైపు చుసిన జాలి చూపులు అర్ధం కాలేదు .
నా ఆలోచనల్లా ఒక్కటే ఇతగాడు నన్ను తనతో తీసుకు వెళ్ళతారేమో వెళ్ళితే నగర సందర్శనం అవ్వుతుంది కదా అని.....ఆలోచనలో వుండగానే పడింది నా మీద దెబ్బ .సొమ్మసిల్లి పోయాను.మెలుకువ వచ్చి చూడగా నా కాళ్ళ వరకు నరికేసాడు ఆ మానవుడు .

భాదని ఓర్చుకుంటూ కన్నీరు కారుస్తున్న నన్ను చూసి నా సన్నిహితులంతా నిస్సహాయంగా విలపించడం మరింత కుదిపేసింది.నన్నే నమ్ముకుని గూటిని ,గూటిలోని పిల్లల్ని వదిలివెళ్ళిన గువ్వల కలకలం ,పిల్లల వెక్కి వెక్కి ఏడ్పులు ,నేలను తాకి విగత జీవులైన పసి గుడ్లను చూసి శోకిస్తున్న ఆ పిచ్చి తల్లులను చూసి ......అయ్యో !నా ప్రాణమైన పోదేమీ అని రోదించాను .నా గుండెతో పాటు వాటి గూడులన్ని చెదిరిపోయాయి .
ఆ నలుగురు నన్ను నిలువునా క్రింద పడవేసి పాశవికంగా తాటి మొకులతో కట్టి నా వారి ముందే నన్ను భలంగా ఈడ్చుకుంటూ వెళ్ళారు ,కడసారిగా నావాళ్ళ కి కంట నీరుబుకుతుండగా కళ్ళతోనే వీడ్కోలు పలికాను .నన్ను ఈడ్చుకేల్లుతున్న వైనం చూసి అందరు ఒక్కసారే గొల్లుమన్నారు .నన్ను వదలక నా బిడ్డలైన పులుగులన్ని వారిని ముక్కుతో పొడుస్తూ భీభత్సం సృష్టించాయి .నా మనస్సు దిటవు పరచుకొని ,వారిని వారించి 'నా వారిలో నన్ను చూసుకొమ్మని ,నలుగురు కూర్చుని ముచ్చటించే వేళ నన్ను తలుచుకోమని హితవు పలికాను .,నా శరీరాన్ని కష్టపడి ఒక భారి వాహనం లో చేర్చారు ..కొంత దూరం వెంబడించిన నా బిడ్డలు మరి రాలేక శోకం తో వేనుతిరిగాయి .

అప్పటికే వాహనం లో నాలానే ఎందరో !అందరి కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి .మా అందర్ని కలిపి కట్టేశారు,ఎక్కడికి జారి పారిపోకుండా .దుఖాన్ని నిగ్రహించుకుంటూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చీకటిలో చుక్కలు చూస్తూ నిద్రలోకి ఒరిగిపోయాను .

25, అక్టోబర్ 2009, ఆదివారం

నేను -2

నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ లేత ప్రాయం వీడి పరిపూర్ణత్వం ఏర్పడింది నా తనువునకి .నా మేను విశాలమై నా ఆలోచనలు విస్తారం అయ్యాయి .అమాయకత్వం వదిలి జీవితం చూడటం నేర్చుకున్నాను ...నా చుట్టూ నా ఈడువారే భిడియం వీడి నా చుట్టూ వున్నవారితో నెయ్యమెరిపాను.మా మద్య ఎన్నో ఊసులు ,పగలంతా మా కబుర్లకు అంతే వుండేది కాదు రాత్రల్లాగువ్వల వద్ద నుండి మేము విన్నవి కన్నవి పంచుకునేవాళ్ళం .
రాత్రయ్యేసరికి నా తనువంత సందడే ..చిన్న కీటకాలు మొదలు రంగురంగుల పిట్టలకు ఆవాలము నేనే ..వారిని ముద్దుగా హత్తుకున్నానేగాని కొంచమైన విసుగుచెంధలేదు .ఒక గడసరి గువ్వ నన్ను తొలచి నా హృదయం లోనే గూడు కట్టుకుంది నన్నడగకుండానే....ఎక్కడినుండి తెచ్చుకుందోగానిబుల్లి గువ్వని ముద్దుగా కాపురం నా లోగిలిలోనే పగలల్లా ఆ గువ్వల జంట పిల్లలికి కాపలాగా లాలిస్తూ ....వాటి సుఖ సంతోషాల్లో ,వ్యధల్లో పాలు పంచుకుంటూ రెక్కలొచ్చి రివ్వునెగిరిపోయే పిల్లల్ని చూసి దిగులు పడుతూ కొత్తగానన్ను చేరే గువ్వల జంటలకి స్వాగతం చెబుతూ ...ఇలా ఎన్నో జంటల జీవితాలకి సాక్షి భూతం అయ్యాను

నా వయస్సు తోపాటే ప్రపంచ జ్ఞానం పెరిగింది .కాకమ్మ చిలకమ్మలు ఎప్పుడు మనుష్యుల గురించే మాట్లాడుకునేవాళ్ళు ,వాళ్ళు ఎలా వుంటారో మాకు చూడలన్పించేది .వారి మాటల బట్టి నాగరికత మార్పు వస్తుందని తెలుస్తుంది .రాను రాను అవి పట్టణాలకి వెళ్ళే పరిస్థితి తగ్గిపోతుందట,ఎంతో ఆందోళన పడుతూ అవి చెప్పుకునే కబుర్లు వింటుంటే మా మనుగడకి ఏదో ముప్పు వుంటుందని తోచేది .అసలు అవి చెప్పుకునే కబుర్ల కోసం సాయంత్రం నుండే ఎదురు చూపులు ...ఎప్పుడైనా రావలసిన సమయానికి అవి రాకపోతే ఎంతో ఆందోళనకి గురయ్యేదాన్ని .....గువ్వల ఊసులు వింటే మాకు ఆ నగరాలను చూసిరావాలనే కోరిక గా వుండేది
ఎన్నో వసంతాలు ,శిశిరాలు చూసిన ఈ నా జీవితం నిస్పృహగా మారుతున్న తరుణం లో ఒక అధ్బుతం జరిగిందీ ....

24, అక్టోబర్ 2009, శనివారం

నేను

కళ్ళు విప్పిచుసే సరికి చుట్టూ అంత పచ్చగా నాలానే ....ఎండవానలో ఊహవచ్చేవరకు ఎదిగాను ....అసలు ఎందుకు పెరుగుతున్ననో ,ఎక్కడినుంచి వచ్చానో నాకే తెలిదు ..చినుకు రాలినపుడు పరవశించుతూ ,ఉరుములు ఒరుమినపుడు ఉలిక్కిపడుతూ .. మెరుపులు చూసి ఆశ్చర్యపోతూ ....మంచుకి వణుకుతూ ఇదంతా ఏవిటని .అడగాలంటే చెప్పేవాళ్ళు లేరు అన్నిటిని చూస్తూ ...రాత్రివేళ నిద్ర రానపుడు నక్షత్రాలను లెక్కపెడుతూ ...
ఎప్పుడు పూయడం మొదలు పెట్టానో ...నాలో వయసేప్పుడు వికసించిందో నాకే తెలీదు ..వసంతం లో కోయల కూసినపుడు తొలి వలపు గుండెల్లో వికసించడం మాత్రం గుర్తుంది .ప్రకృతి నాలో నింపిన సొగసునంత నీలాకాశం కింద పచ్చగా పరిచాను .నా పూల సొగసుకి మురిసిన తుమ్మెదల ఝుంకారాలు,తీనటీగల హోరు ,సీతాకోక చిలుకల సందడి.......నాలో ఏదో చిన్న గర్వం ...నాకోసమేకదాఅని హొయలు ...అసలు ఇంతకి నేనెవర్నో ..?