25, ఆగస్టు 2012, శనివారం

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-4

నాలుగవ రోజు నలుగు ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే వుంది మా అమ్మాయి బాల్య స్నేహితులు డిగ్రీ స్నేహితులు సెంట్రల్ యునివెర్సిటీ స్నేహితులు నా స్నేహితులు ఎక్కడెక్కడి వారో వచ్చారు పలు రాష్ట్రాల సమ్మేళనం ఆ నాడు మా ఇంట కానవచ్చింది .వారందరికీ తెలుగువారింట వివాహ  వ్యవహారాలు ఒకింత వింతగాను ఆసక్తిగా అనిపించి శ్రద్దగా పాల్గొన్నారు.అతిధులను ఆహ్వానిస్తూనే మరొక ప్రక్క మరుసటి రోజు వివాహానికి జరగవలసిన పనులను పర్యవేక్షిస్తూ ఇంటివారందరికి ఒక్కొక్కపని అప్పగించడం జరిగింది .  వివాహసమయం లో ఏర్పాటు చేసే   విందు  భోజన పూర్తి పర్యవేక్షణ నా స్నేహితురాలు మరికొంతమంది దగ్గరి బంధువులు బాద్యత తీసుకున్నారు (అన్నిటికంటే అతి ముఖ్యం నా ఉద్దేశం లో )
మధ్యాహ్న భోజనం తరువాత మగ పెళ్ళివారు కొంతమంది స్త్రీలు (ఆడపడుచులు అబ్బాయి మేనత్త వరుసైన వారు )తొమ్మిది మంది పెద్దలు అమ్మాయికి "ప్రధానం"తీసుకువచ్చారు .ఈప్రధానం లో అమ్మాయికి  అత్తింటి వారు పెట్టె చీరే సారెలుసూట్ కేస్ టాయిలెట్ కిట్ సహాఇంకా  పసిడి వెండి కానుకలు,లడ్డులు పూలు తమలపాకులు అరటిగేలలు ఎండుకోబ్బరిచిప్పలు కర్జురాలు రవికె పన్నాలు పసుపు కుంకం గులాము వున్నాయి.పెళ్ళికూతురు కి పట్టు చీరే కట్టబెట్టి తూర్పు సింహ ద్వారానికి అభిముఖంగా పీట మీద తోటి పెళ్ళికూతురి సహా కూర్చోబెట్టి అమ్మాయి తరుపు పెద్దలు (మగవారే )అబ్బాయి తరుపు పెద్దలు వృత్తాకారంలో క్రింద కూర్చుని తాంబూలాలు ఒకరికొకరు మార్చుకుని (నిశ్చితార్ధం రోజు వియ్యంకులు మార్చుకున్నట్లు )వారిచ్చే ప్రతి వస్తువు అక్కడ వున్నా బంధు మిత్రులకి చూపిస్తూ నచ్చలేదని (సరదాకి )ఆడపెళ్ళి వారు గోల చేస్తూ అమ్మాయి బరువుకి ఏమాత్రం తగ్గకుండా వస్తువులు తూకం వేయాలంటూ ఒక రెండు గంటలు సాగింది. మంగళ సూత్రం తాడు నల్లపూసలు తప్పించి మిగిలిన వస్తువులన్నీ పెళ్లి కుమార్తె కి అబ్బాయి తరుపు పేరంటాళ్ళు ఒక్కొక్కటిగా అలంకరించారు.అయిదుగురు పెద్దలు పట్టు ఉత్తరీయంలో సన్నని పోగులతో కూడిన పసుపు బందు పోగు గుండ్రంగా నిలబడి అమ్మాయి  మెడ లో వేసారు అది పదహారు రోజుల పండగ వరకి ఉండాల్సింది .వారు తెచ్చిన పళ్ళు పూలు తాంబూలాలు ఆ కార్యక్రమంలో వున్నా స్త్రీ లందరికి పసుపు కుంకం తో ఇచ్చారు ,పెళ్లి పెద్దలు అటుఇటు వారు బెల్లం పానకాలు మార్చుకుని త్రాగారుఆ తరువాత మగ పెళ్ళి వారు అల్పాహారం మాత్రం తీసుకుని  ఒక పెద్ద ముత్తయిదువని పెళ్లి కూతురు వద్ద వదిలి పెళ్ళికి కలుద్దామని సెలవు తీసుకున్నారు ఆ సాయంత్రం కూడా  ఎక్కడెక్కడో మిగిలి వున్నా బంధువులు నలుగు పెట్టి పసుపులు వేసారు మర్నాడు కేవలం తల్లి మాత్రమె చేయాలి కాబట్టి .ఆ రాత్రి అన్ని సర్దుకుని విశ్రాంతి తీసుకునే సరికి తెల్లారు ఝాము రెండున్నర అయ్యింది .ఎవ్వర్కి నిద్రలు లేవు ఎక్కడ చుసిన గుంపులుగా కూర్చుని కబుర్లు ఆటలు గోలలు మామిడి తోరణాలు ఉదయం దీపారాధన తరువాత కట్టడానికి తోరణాలు తయారు చేస్తూ అబ్బాయిలు ..ప్రతి ఒక్కరు భాద్యతగా తమకిచ్చిన పనులు చేస్తూ కనిపించారు .తెల్లారు ఝాము ముడున్నరకే దీపారాధన అని సన్నాయి మేళం వాళ్ళు వచ్చేశారు గంటయిన విశ్రాంతి తీసుకుందామని అప్పటికే అలసి నిద్రలో వున్నా నా చిన్ని ప్రక్కలో చేరి నిశబ్దంగా  కన్నీరు తుడుచుకుంటూదగ్గరికి తీసుకుని పోదుపుకుని నిద్రకి ఉపక్రమించాను .         

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

very good

Hima bindu చెప్పారు...

@kastephale
thanq sir

జలతారు వెన్నెల చెప్పారు...

మీరు రాస్తుంటే కళ్ళకు కట్టినట్టే ఉందండి.

Hima bindu చెప్పారు...

@జలతారు వెన్నెల
హ్మం!
థాంక్సండీ ఇంకొంచెం ముందు రాసినట్లయితే ప్రతి ఈవెంట్ జ్ఞాపకాల్లోంచి మరుగునపడేది కాదేమో..