23, డిసెంబర్ 2010, గురువారం

ఇదీ మన పరిస్థితి

ప్రజల కోసం మేము అని చెప్పుకునే నాయకులు జన జీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నాం అని ఎందుకు అనుకోరో! గాంధేయ మార్గం అనుసరిస్తున్నాం అని చెప్తూనే తమ స్వలాభం కోసం ఉనికిని చాటుకోవడానికి రాస్తారోకో ,రైల్ రోకో ...ఒక ప్రక్క శాంతిమార్గం లో నిరాహార దీక్ష మరో ప్రక్క ముట్టడి పేరుతో హింసాయుత మార్గం ప్చ్.
జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనచోధకులకి తీవ్రమయిన అంతరాయం గంటలు గంటలు ...ప్రాణాల మీదకి వచ్చి మెరుగయిన వైద్యం కోసం వెళ్తున్న రోగులు సైతం జాతీయ రహదారుల్లో నిర్దాక్షిణ్యంగా పడిగాపులుపడవలసి వచ్చింది.రాజకీయ స్వార్ధలకోసం సామాన్య మానవులు మూల్యం చెల్లించాల్సివస్తుంది .
థూ వెధవ దాహం

18, డిసెంబర్ 2010, శనివారం

నా షిర్డీ యాత్ర

అప్పుడెప్పుడో ఉత్తుత్తి తీర్ధయాత్రనా అమరనాథ్ యాత్ర


చేసి అందర్నీ నమ్మించేసానుకాని ఈ సారి మాత్రం నిజంగానే వెళ్ళివచ్చాను .అసలే చాలామంది మిత్రులు మొత్తుకుంటున్నారు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే యాత్రలు చెయ్యాలని ముఖ్యంగా అలనాటి సుప్రసీద్ద కవి "ధూర్జటి "కూడా మొత్తుకున్నాడని:-) ఇరవయ్యి ముప్పయ్యి ఏళ్ళ మద్య విహార విజ్ఞానతీర్థయాత్రలు చేసి అలసిన నాకు తిరిగి కొంత దైవ చింతన (అప్పుడెప్పుడో దేవుళ్ళకి వున్నా నా బాకీ లుతీర్చే నెపము )కలిగి కొత్త అప్లికేషన్లు పనిలో పని పెట్టించడానికి నా ముద్దుల కూతురు నిమిత్తమై కదిలాము కుటుంబం అంతా (ముగ్గురం ).ఈ నాలుగు రోజులు నాలుగు గంటల్లా గడిచిపోయాయి .
షిర్డీ చాల చాల మారిపోయింది చాలా కాలం తరువాత వెళ్ళడం వలన (గతం లో ప్రతి యాడాది వెళ్ళేవాళ్ళం ) రూపురేఖలే మారినట్లు కనబడింది.ఒకప్పుడు బాబా వారి సమాధి అతి దగ్గరగా తాకే అవకాశం వుండేది.సునాయాస దర్శనం వుండేదిఇప్పుడు కనీసం రెండుగంటలు తప్పదురద్దీ సమయం లో ఇంకా ఎక్కువే.కళ్ళ ముందు పూరిపాకలు చిన్న ఊరు సరయిన ఆహారం వుండేది కాదుఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ ప్రాంతాలవారి రుచులతో భోజన సదుపాయంరవాణాసదుపాయంఆ ప్రాంతాన్ని చూస్తుంటే పెద్ద నగరం లా అనిపించింది .మిగిలిన దేవాలయాల్లో వున్నట్లు ఇంకా శిర్దికి కొన్ని తాకలేదు .సామాన్యులు కి కూడా ఎన్నో సౌఖర్యాలు అందుబాటులో వున్నాయి వి.ఐ.పి దర్శనాలు కొంత ఇబ్బంది కలిగిస్తున్న మిగిలిన దేవాలయాలతో పోలిస్తే లెక్కలోనికి రాదు .భక్తులతో నిత్యం కిటకిటలాడుతున్న షిర్డీ,కనీసం రూపాయి దర్శనం టికెట్ పెట్టిన చాలా ఆదాయం సమకూరుతుంది,కాని ఇటువంటివి ఏవి లేకుండానే ఆలయం చక్కగా నిర్వహించబడుతుంది.ఎన్ని ఒత్తిడులతో వున్నా బాబా ని చూడగానే మనస్సంత ప్రశాంతం గా కొండంత అండ మనకోసం అన్నట్లు అనిపిస్తుంది.వెళ్ళిన రోజే సాయంత్రం హారతికి అందుకున్నాం.చాలా సంతోషం అనిపించింది లేకపోతె అరగంట బాబా ముందు వుండటం కుదరదు కదా ! ఒకప్పటి షిర్డీ యే నాకు బాగున్నట్లు అనిపించింది..అప్పుడు స్వేచ్చ స్వచ్చత అపారంగా ఉండేవి .


12, డిసెంబర్ 2010, ఆదివారం

ప్రియం అయిన స్నేహం

కొంతమంది తో జీవితాంతం స్నేహం నిలిచిపోతుంది .అలాంటి వాళ్ళ లిస్టు లో మా "నాగు " చేరుతుంది.నాగు అంటే నా ఎనిమిదవ తరగతి స్నేహితురాలు.నేను అక్క తో పాటు ఏలూరు తెరిసాహాస్టల్లో చేరగానే నా క్లాస్స్ వాళ్ళు పది మంది చుట్టూ చేరి ఎక్కడి నుంచిఏ స్కూలి నుండి వచ్చానో వివరాలు అడుగుతూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అక్కడున్న వాళ్ళలో ఒకమ్మాయి (నాగమణి )మాత్రం స్వీట్ గా నవ్వుతు చూస్తూ నన్ను ఆకర్షించింది .అప్పట్లో కొత్తగా వచ్చిన వాళ్ళని ఒక వారం కాస్త టీజింగ్ గా చూసేవాళ్ళు (నేను తరువాత అలానే చేసాను ). కాని నాగమణి మాత్రం అస్సలు అలా చేసేది కాదు.ఎవర్ని నొప్పించడం తనకి తెలీదు.చాల మితంగా మాట్లాడేది నేను మాత్రం తనకి అపోజిట్ అయిన మా ఇద్దరికీ స్నేహం కుదిరింది .చెప్పాలంటే నేను తన వెనుకపడి మైత్రి కుదుర్చుకున్నానేమో..నాకు నచ్చితే అలానే చేస్తాను ...గుర్తు రావడం లేదు .ఎవ్వరితోనయిన అభిప్రాయ బేధాలు వస్తే మాట్లాడటం మానేదాన్నికాని 'నాగు 'తో మాత్రం సర్దుకోవడం నేర్చుకున్నానుఎందుకో తెలీదు తనకి నచ్చని పని కి (స్టడీ అవర్ లో సిస్టర్స్ చూడకుండా పుస్తకాల్లోపెట్టి నవలలు చదవడం లాంటివి ) దూరం వుండేదాన్ని.నాగు కూడా నా అల్లరిని నవ్వుతు ఎంజాయ్ చేసేది, స్కూల్లో మా ఇద్దరి సెక్షన్స్ వేరయినా హాస్టల్లో ఉన్నంతసేపు కలిసే వుండేవాళ్ళం.నాగు కి చిన్నప్పుడే నాన్న లేరు ,అది తెలిసి తానంటే ఒకరకమైన కన్సర్న్ అంతర్లీనంగా వుండేది.ఇంటర్ మొదటి సంవత్సరం వరకి తనతోనే కలిసి చదివాను ,ఆ తరువాత నేను విజయవాడ వచ్చిన మా ఇద్దరి మద్య ఏ మాత్రం దూరం పెరగలేదు ,ఎప్పుడైనా ఫోనులో పలకరింపులు (హాస్టల్లో రేస్త్రిక్షన్స్ )చాలా వరకు ఉత్తరాలు ...నేను నాలుగు రాస్తే తను ఒకటి రాసేది అందులోనే ఎన్నో కబుర్లు ....దశాబ్దాలు గడచినా అదే ప్రేమ ,అదే ఆప్యాయత.ఇప్పటికి మెరుపులా మెరుస్తుంది. నాగు ఎవరితో టచ్ లో వున్నా లేకపోయినా నాతో మాత్రం కనీసం ఆరు నెలలకి ఒకసారయిన మెయిల్ రాయడమో ,మాట్లడటమో చేస్తుంది :-) చెప్పా పెట్టకుండా ఇండియా వచ్చి మెరుపులా కనబడి మాయం అవుతుంది .నా స్నేహితులకి నాగు విశేషాలు తెలియాలంటే నన్ను అడగవల్సిందే...పదిసార్లు కాల్ చేస్తే ఒక్కసారే తిరిగి కాల్ చేస్తే ఎవరు మాత్రం ఓపిక పడతారు :-)ఎవరో నాలాంటి వాళ్ళు తప్పించి . రెండు నెలల క్రితం హటాత్తుగా ప్రొద్దున్న ప్రొద్దున్నే కాల్ చేసింది ,నేను మినిస్టర్ ప్రోగ్రాం హడావిడిలో వున్నాను,అయిన అన్నీ ప్రక్కన పెట్టి అరగంట మాట్లాడాను.అప్పుడు అర్ధం అయ్యింది తను నాకు ఎంత ముఖ్యమో....స్నేహం కాని ,ప్రేమ కాని ఇవ్వటమే కోరుకుంటుంది కాని అవతలి వారి నుంచి ఏమి కోరుకోదు అనుకుంటాను ..
నిన్న నాగు కి ఎందుకు గుర్తుకు వచ్చానో..ఒకే ఒక్క లైన్ ఎలా వున్నావు అని.రాసింది,అదే నాకు కొండంత సంభరం.రాత్రి విజ్జి కి వెంకట్ కి చెబితే ఒకటే నవ్వు ...ఆ ఒక్క లైన్ రాయడానికి దానికి ఎన్ని రోజులు పట్టిందో అంటూ ...మరి నాగు అంతే :-)

30, నవంబర్ 2010, మంగళవారం

మమ్మీ డోంట్ వర్రీ

వారం నుండి అనుభవిస్తున్న టెన్షన్ కి మధ్యాహ్నం తెరపడింది .నిజానికి నిన్న మధ్యాహ్నం నుండి ఎదురుచూస్తూనే వున్నాం ...ఉదయం బయటికి వెళ్తూ కూడా ఈ రోజు ఇంట్లో వుంటే బాగుండేదేమో అటు ఇటు అయిన ఎలా ..తను కూడా సమయానికి లేకపోయే అనిపించింది . ..తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి .మొబైల్ మొగినప్పుడల్లా గుండె దడదడ .....అటుఇటు యేరు ...ఎగురుతున్న కొంగలు ..నీలగగన గానవిచలన.....ధరణిజ శ్ర్రేరమణ
..మధురవదన నళిననయన మనవి వినరా రామ .....(నా మొబైల్ రింగ్ టోన్) అనుకున్నట్లే హోం అని డిస్ప్లే ...మమ్మీ ...స్వీట్ గా ....డోంట్వర్రీ .
హమ్మయ్య ఈ సారి ష్యూర్ ....గట్టినమ్మకం .

26, నవంబర్ 2010, శుక్రవారం

దేశవాళి తిండ్లు -రేగువడియాలు


ఈ రోజు ఇంకొకరకం దేశవాళి తిండి పరిచయం చేస్తున్నాను .పైన ఫోటోలోని చక్రం ఆకారం చూసి పిడక అని భ్రమ పడతున్నారేమో కానేకాదు ,దీనిని "రేగుపండు వడియం "అంటారు .ఒక సంవత్సర కాలం నిలువ వుంటాయి.ఇవి ఎక్కవగా గోదావరి జిల్లవాళ్ళు అక్కడక్కడ మావంటి కృష్ణా జిల్లా వాళ్ళు కూడా పట్టి నిలువ ఉంచుతారు .పైన చూసేది కొన్న రేగువడియం ..ఇంట్లో చేస్తే ముద్దగా ఇంకొంచెం చిన్నగా రంగు పండు మిరప కలిగి వుంటాయి .
రుచి ఎలా ఉంటుందంటే పుల్ల పుల్లగా ,కారం కారంగా కొంచెం తియ్యగా వుంటుంది .నేను అత్యంత ఇష్టపడే ఫుడ్ లో రేగువడియాలు ఒకటి .అమ్మ మాకోసం తప్పనిసరిగా సీసన్ లో తయారు చేసేది .మా చిన్న తమ్ముడు శ్రీను కి ప్రాణం ఇవి వుంటే వేరే ఫుడ్ గురించి ధ్యాస వుండదు ...వాడి కి సప్తసముద్రాల అవతల వున్నా కొరియర్ చేయడం మరిచిపోము .
రుచి చూస్తారా ?అడ్రెస్స్ ఇవ్వండీ పంపిస్తాను :-)

24, నవంబర్ 2010, బుధవారం

దేశవాళిచిరుతిండ్లు
















ఇక్కడ ఫోటోలలో చూస్తున్నది తేగా అంటారు .రుచి చాల బాగుంటుంది .కొత్తగా ట్రై చేసేవాల్లకి అస్సలు నచ్చదనుకొండీ .ఇవి తాటి పండు ను భూమిలో నాటితే తయారవుతాయి త్రవ్వకుండా వదిలేస్తే బుల్లి తాటిచెట్టు వచ్చేస్తుంది .దీనిని తినడం కూడా కొంచెం కష్టమే ...కాని నేను మాత్రం నేర్చేసుకున్నాను ,ఎలా అంటారా ...చిన్నప్పుడు ముత్యాలముగ్గు సినిమా చూసి తెలుసుకున్నాను :-) అన్నట్లు తెగలు అన్ని చోట్ల దొరకవండీ దొరికిన అంత రుచి వుండవు ...రుచిగల తెగలు తినాలి అనుకుంటే గోదారి జిల్లాకి అడుగు పెట్టాల్సిందే .అక్కడ కూడా ఎర్రమట్టి ఇసుకనేలలో దొరికేవి పొడి పొడిగా చాలా బాగుంటాయి ఊనగట్ల చాగల్లు ప్రాంతాల్లోవి అధిక డిమాండ్ వుంటాయి .అటు ప్రాంతం వెళ్ళడం జరిగితే నా కూడా ఇంటికి తేవడమే కాక అదేదో నేనే పండించినట్లు అందరకి పంపిస్తాను .తినాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అటు వెళ్ళినపుడు ట్రై చేయండీ .





దేశవాళి తిండ్లు-జున్ను

ఇక్కడ ఫోటోలో వున్నది స్వచ్చమైన దేశవాళి జున్ను .మొదటి రోజు తీసిన పాలతో నేనే స్వయంగా వండాను .ఎక్కడిదంటే మా చిన్నత్తగారు పెరట్లో బుల్లి బుజ్జాయి పుట్టింది ,అదే సమయంలో గోదారి ఒడ్డున వున్నా ఆ ఊరు పనిమీద వెళ్ళడం జరిగింది .నాకోసం జాగ్రత్తగా దాచి ఉంచింది అత్తయ్య ,కావలసినప్పుడల్లా కొన్ని పాలల్లో ఈ జున్ను పాలు కలుపుకుని ,మిరియాలు ,అల్లం ,యాలక పొడి ,బెల్లం కొంచెం పంచదార కలిపి కుక్కర్ లో పావుగంట పెడితే కమ్మటి జున్ను రెడీ ,ఫ్రిజ్ లో పెట్టుకుని తింటే ఆ రుచి అద్భుతం .
నిన్న రాసిన టపా ఎగిరిపోయింది ,అందుకే మళ్ళి రాసా కష్టపడి :-(