23, ఏప్రిల్ 2010, శుక్రవారం

కృతజ్ఞతలు

నాకు ఎవరైనా సహాయం చేయగానే వారికి తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను .ఆ సహాయాన్ని జీవితకాలం లో మరచిపోను ,వారి ఋణం తీర్చుకునే అవకాశం కోసం చూస్తాను .కొన్ని సమస్యలు ఎంత ప్రయత్నించిన పరిష్కారం కావు అటువంటి సమయం లో భగవంతుని పై భారం వేసి నువ్వే పరిష్కరించాలి అని అతి వినయంగా కోరుకుంటాను. వినయం అని ఎందుకు అన్నాను అంటే సమస్యలు వచ్చినపుడే 'దేవుడు'అనేవాడు మనకి గుర్తొస్తారు కాబట్టి .నిజానికి చిన్నప్పుడు నాకు భక్తి తక్కువే ,ఏదో పండుగాపబ్బాలకి అమ్మ ప్రక్కనే పూజ అయ్యేవరకి ఓపికగా కూర్చునేవాళ్ళం త్వరగా అయితే టిఫిన్ గట్రా తినేసేయ్యోచ్చని అన్నీ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే .వినాయక చవితి రోజు మరీ విసుగోచ్చేసేది ,పుస్తకం లో పేజీలు లేక్కపెట్టేదాన్ని అమ్మ గమనించకుండా .అమ్మ పురాణాలు నీతి కథలు తీరిక వేళల్లో ముఖ్యంగా సెలవల్లో ,ఆదివారాల్లో మా ఆరుగురు పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ఒకే పళ్ళెం లో అందరికి అన్నం కలిపి తినిపిస్తూ చెప్పేది .నాకు కొందరు దేవుళ్ళు గా మనసుకి అనిపించేవారు కాదు ...వారు మన చరిత్రలో రాజులు లేక ఒక తెగకి నాయకులు లా అనిపించేవారు ,అలా అని అమ్మ తో అంటే తప్పు అనకూడదు అనేది .ఏడెనిమిది తరగతులుకి వచ్చాక మిషనరీ స్కూల్స్ లో చేరడం హాస్టల్ లో ఉండటం తో అక్కడ తప్పనిసరిగా ఆదివారం ఉదయం ప్రేయర్ సర్విస్ వుండేది మానితే పనిష్మెంట్ వుండేది నిశభ్దంగా ఆ గంట గడిపేవాళ్ళం ఆ పూట బ్రేక్ ఫాస్ట్ ఏమి చేసి ఉంటారా అని .,అవకాశం వచ్చినప్పుడల్లా సిస్టర్స్ దేవుడి గురించి ,ఆ మదర్ గొప్పదనం గురించి చెప్పేవారు ,లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించే ఎక్కువ చెప్పేవారు ....ఇప్పుడు బాగుంటే చాలుగా పోయాక మనకి యెం తెలుస్తుంది ,అనుక్షణం చనిపోయాక వెళ్ళే స్వర్గం గురించి మనకి ఎందుకు వేదన అని అనుకునేదాన్ని ..
.ఇప్పుడుకూడా :-)
తరువాత తరువాత పరీక్షలప్పుడు దేవుడు గుర్తు రావడం మరల కనుమరుగవడం నా టీన్స్ లో పరిపాటయ్యింది .
కొన్ని సంవత్సరాలు అసలు దేవుడే లేడు అనుకుని నమస్కరించడం మానేసాను.సాటి మనిషికి హాని చేయకుండా ,దూషణ నెరపకుండాచేయగలిగిన సహాయం చేస్తూ, దయ కలిగి వుంటే చాలు మనకి తెలీని స్వర్గం నరకం గురించి ఆలోచించడం అనవసరం అనుకున్నాను
కొన్ని విపత్కర పరిస్థితుల్లో మనస్సును ప్రశాంతత వైపు మళ్ళించడానికి 'భావాతీతధ్యానం 'వైపు దృష్టి సారించాను.గురువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాను .నా ఆలోచన పరిధి విస్తారమయ్యింది(బహుశ వయస్సు కారణం కావచ్చు )
మనకి తెలియని ఒక అధ్బుతమైన శక్తి ఒకటి మనల్ని నడిపిస్తుంది అని నమ్మకం ఏర్పడింది ,ఆ శక్తి కి ఎవరికి తోచిన విధం గా ఆ పేరుతో పిలుస్తారు కాబోలు అనుకుంటాను .ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి సమాధానాలు దొరికిన పుస్తకాల్లో వెదుక్కుంటాను తరుచు మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళ సంభాషణలో దొరుకుతుంటాయి
నాకు కావలసిన శక్తి ,ధైర్యము కోసం ఆ భగవంతుని అడుగుతుంటాను గురువు సహాయం తో ....
నాకు నిరంతరం తోడుగా అన్ని వేళలునన్ను హెచ్చరించి మానవత్వం నాలో నశించకుండా కాపాడే దైవ సమానుడు "శ్రీ సాయి"
ఎంతటి జటిల సమస్య వచ్చిన వివేకం తో మెలిగి ఆ సమస్యను తొలగిపోయేలా చేసుకొనడానికి నాకు ఎంతగానో సహాయపడుతుంటారు .
రెండేళ్ళ క్రితం నన్ను చుట్టుముట్టిన సమస్య విడిపోయి మనస్సుకి ప్రశాంతత చేకూరింది .నన్ను నడిపిన గురువుకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ రోజు సాయంత్రం ఇంట్లో అయిదు నుండి ఎనిమిదిన్నర వరకి సాయి సంకీర్తన ఏర్పాటు చేసాను .సాయి ని అనుసరించేవారంతా ఆహ్వానితులే ....అనంతరం ఫలహారం కూడా .....................

3 కామెంట్‌లు:

భావన చెప్పారు...

నేను సశరీరం గా రాక పోయినా, నా తలపు మీతో పాటూ గురు ముఖాన నమస్సులతో వుంటుంది. consider I am there Chinni.

మురళి చెప్పారు...

బాగుందండీ...

Hima bindu చెప్పారు...

@భావన
మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం సంకీర్తనలో వుండగా మీ మాటలు గుర్తొచ్చాయి .ధన్యవాదాలు .
@మురళి
:-)