16, అక్టోబర్ 2009, శుక్రవారం

''అల ''జడి

హమ్మ !యెంత నంగనాచివమ్మకృష్ణమ్మా
నిన్నటి వురుకు పరుగులేమయ్యయమ్మా ..
చేయాల్సినదంతా చేసేసి మౌనంగా సాగిపోతున్నావే
కలలో కూడా ఊహించని కల్లోలం రేపావే
కంటిమీద కూసంత కునుకు తీయనీక కుదిపెసావే
నీ ఒరవడికి తట్టుకోలేనంత ఉక్కిరి బిక్కిరి చేసావే
ప్రశాంతంగా సాగుతున్న జీవితాన్ని కలతబెట్టావే

నీ ప్రేమావేశ మొహంతో వువ్వేత్తరంగాలతో
నీ సందిట భందీ చేస్తే తట్టుకోగాలరనుకున్నవా
చూడు నీవు చేసిన గాయాలు ఇంకా మాయనేలేదు
చేయవలసినధంత చేసి నన్నేరగానట్టు కదిలి పోతున్నావా
నీవు చేసిన అల్లరి ఓపికగా భరించామే కాని నీపై కినుక వహించలేదే
ఎందుకంటావా ......నువ్వంటే మాకెంతో ఇష్టం అని చెప్పమంటావా ..........




ఒక్కసారి ఆలోచించండీ

దీపావళి అందరికి ఇష్టమైన పండుగే ...చిన్నప్పుడు నాకు చాల చాల ఇష్టం ...పుట్టిన రోజుకోసం ఎదురు చూసినట్లు ఎదురు చూసేదాన్ని ...కాని ఈసారి పండగ చేసుకోవడం అంటే మనస్సు ఒప్పడం లేదు ...చేసుకునేంత మంచి వాతావరణం లేదు .........రాష్ట్రం లో కొన్ని ప్రదేశాల్లో ఇంకా ఆనాటి జాడలు పోలేదు అయిన తప్పదు మన పద్ధతి ప్రకారం మనం జరుపుకుంటాం ....
ఒక్కసారి భాణసంచా కొనేప్పుడు ఆలోచించండీ అనవసరంగా తగలబెట్టేవాటిల్లోకొంత వరద ప్రాంత భాధితులకు వెచ్చించండి ...మన ఆనందం కోసం వెచ్చించే రూపాయి ఒకరి ఆకలి అయిన తీరుస్తుందేమో .....ఆలోచించండీ.

14, అక్టోబర్ 2009, బుధవారం

నా "అద్దాల గోల "

ఈ మద్య ఉదయాన్నే పేపర్ చదవాలంటే తెగ ఇబ్బందిగా వుంది ...ఇబ్భంది ఉదయాన్నే లేవటం లో అనుకుంటున్నారా ....అబ్బే ..అదేమీ కాదు అంత చిన్న చిన్న అక్షరాలూ మరీ నలకల్లా కనబడీ పేపర్ కాస్త దూరం పెట్టుకుని చదుతుంటే అంత కష్టపడే బదులు కాస్త ముఖానికి ఆ అద్దాలు తగిలించుకోరాదు అంటూ ఓ ప్రక్క ఈయనగారి వెక్కిరింత ...అసలే కళ్ళద్దాలు అంటే చిరాకు పొద్దున్న పొద్దున్నే ఏమి పెట్టుకుంటాం అందుకే లాంగ్ షాట్ లో చదుతు సరిపెట్టుకుంటున్న కొన్ని తరువాత చదవచ్చులే అని వాయిదా వేసేస్తున్నాను ..అస్సలు మొన్న మొన్నటివరకు గ్లాసెస్ లేకుండా బానే చదివాను రాను రాను తేడా స్పష్టంగా తెలుస్తుంది .కొన్నాళ్ల క్రితం గమనించి టెస్ట్ కి వెళితే ప్రాబ్లం ఏమీలేదు కాని గ్లాసెస్ వాడాలి అన్నారు డాక్టర్ ..అదేంటండీ ప్రాబ్లం ఏవిటంటే .....వయస్సు తల్లీ అన్నారు ...దీన్ని చత్వారం అంటారు ఒక్కోసారి తగ్గిపోతుంది ,చదివేప్పుడు రాసేప్పుడు తప్పనిసరిగా వాడండి ,కళ్ళు స్ట్రైన్ అవ్వవు అన్నారు ...

నేను ఉదయం పేపర్ చూడటం తప్పించి మిగిలిన సమయాల్లో అంటే ఆఫీసు పని లో ,పుస్తకాలు చదివేప్పుడో ,ఇలా సిస్టందగ్గర వున్నప్పుడో తప్పనిసరిగా నా సులోచనలకి పనిపెడుతూనే వున్నాను .
ఒకసారి ఒక జర్నలిస్ట్ పని మీద నా దగ్గరకి వచ్చారు ..మాట్లాడారు తనకి కావలసిన సమాచారం ఇచ్చాను ,ఏవో ఫైల్స్ చూసి చెప్పాల్సి వస్తే గ్లాసెస్ తీసి పెట్టుకుని ఫైల్ చూస్తూ చెబుతుంటే సడెన్గా అతను ...మీరు గ్లాసెస్ పెట్టుకుంటే పెద్దవాళ్ళ లా...వున్నారు అని ముఖం మీద అంత పరిచయం అప్పటికి లేకపోయినా అనేసారు .,అంతే మనము ఉలిక్కిపడ్డాం-:) అసలే మనకి సంతూర్ అని బిరుదాయే.....ఏ కాలేజ్ ?పెళ్లి అయ్యిందా అని అప్పటివరకు అనిపించుకుని :):)...ఇప్పుడేమో వెధవ కళ్ళద్దాల వలన పెద్దరికమా!...నేను తేరుకుని ''పెద్దదాన్నే కదా అలానే కనిపిస్తాను ''...అని వెధవ నవ్వు నవ్వి వురుకున్నాను .
ఇక ఆరోజు ఇంటికి వెళ్ళాకా మా పాపని ,మావారిని అడిగాను ,నేను అద్దాలు పెట్టుకుంటే ఏవైనా తేడా వుందా అని ,వాళ్ళ ప్రాణం తీశాను ...మా పాపమో '' కాస్త అమ్మ లా కనబడుతున్నావు ఇలానే రోజాంత పెట్టుకో ''అన్నది నన్ను ఎడ్పించడానికి..అమ్మ ని ,చెల్లిని అందర్ని అడిగి చివరికి తేలింది ఏవిటంటే మనకి అద్దాలు నప్పడం లేదని ..అలాటి కళ్ళద్దాలు పూర్తిగా వాడే పరిస్థితి వస్తుందేమోనని నా బెంగ . ..నిజానికి నాకు ఇవి కొత్త కాదు ఇది చెప్పాలంటే మరోసారి నా ఇంటర్ అయ్యి డిగ్రీ కి అడుగు పెట్టిన మొదటి నెలలోకి వెళ్ళాల్సిందే ..................రేపు చెబుతాను

9, అక్టోబర్ 2009, శుక్రవారం

క్రిటికల్ కేర్ లో 'బాపుబొమ్మ'

సాయంత్రం ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి వెళ్ళకుండా సిటీలో వున్నా మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ కి వెళ్లాను ..ఐ.సి .యు విసిటింగ్ హౌర్స్ సాయంత్రం రెండు గంటలు మాత్రమె కావడం వలన ఒకింత ఉద్విగ్నత తో రూం దగ్గరకి చేరి నా చేతిలోని హ్యాండ్ బాగ్ అక్కడే కూర్చ్చున్న మా కజిన్ ఒడిలో విసిరినంత పనిచేసి తలుపు తోసుకుంటూ రూం లోకి వెళ్లాను.నా కళ్ళు మూలనున్న బెడ్ వైపు వెళ్ళాయి...ఒక్కసారే దిగులు కళ్ళు మసకబారిపోయాయి .....క్రిటికల్ కేర్ బెడ్ మీద ''బాపు బొమ్మ ''...అటు ఇటు నర్సేస్ బ్రతిమాలుతూ పాలు తాగిస్తూమద్య మద్యలో ఆమె తల అడ్డంగా తిప్పుతూ ....నేను తనని సమీపించగానే నన్ను చూసి కనుబొమలు ఎగరవెస్తు నవ్వింది ఆ హాస్పిటల్ రూల్స్ ప్రకారం రెండుజడలు వాళ్ళ యునిఫారం షర్ట్ వేసుకున్న తనని చూస్తుంటే పోలిక లేకపోయినా 'వసంతకోకిల''సినిమాలో శ్రీదేవి గుర్తొచ్చింది .నన్ను గుర్తుపట్టలేదు ..అర్ధం అయ్యింది ...ఎప్పుడో వుండుండి మన లోకం లోకి వస్తుంది..అప్పుడు నన్ను అడుగుతుంది అలానే మాట్లాడిస్తూ వుండగా హటాత్తుగా మన లోకం లోకి వచ్చి నన్ను గుర్తుపట్టి కన్నీరు .....తనకి జ్వరం రావడం తల నొప్పి రావడం చెబుతుండగానే మరల వేరే ధ్యాసలో చిన్న పిల్ల లా గోల ....మూడు రోజుల్లో ఎలా వుండే మనిషి ఎలా అయ్యిందో తలుచుకుంటే గుండె చెరువు అయ్యింది .రంగు మారి,పాలిపోయిన పెదవులు నిర్లిప్తంగా ఎటో చూస్తున్న కళ్ళు చిక్కిపోయిన చెంపలు ....యంత మార్పూ ....ఈమేనా ''బాపుబొమ్మ''....
కళ్ళు తుడుచుకుంటూ బయటకి వచ్చి కొంచెం ఎడంగా వున్నా బాల్కనీ లో కూర్చున్న వచ్చేపోయే వారిని చూస్తూ ...ఒక్కసారే నా మనసు గతం లోకి పరిగెట్టింది... ఆమెను మొట్ట మొదటిసారి నేను ఆరవ తరగతి చదువుతుండగా చూసాను .స్కూల్ నుండి వచ్చేసరికి మా ఇంటి బయటి చక్కబల్ల ఊయ్యాలలో ఒడిలో నెలల బాబుతో అపరిచితురాలు ,కళ్ళు చెదిరే అందం ...మెరిసిపోతూ బాపుబొమ్మ (ఈ పేరు అక్క పెట్టింది ) ఊయల నుండి నేలను తాకుతున్న పెద్ద జడ ....పోటి పడుతూ ఆమె పమిట చెంగు ....అలా కళ్ళార్పకుండా చూస్తున్న మమ్మల్ని ఆవిడకు పరిచయం చేసింది మా అమ్మ .ఆవిడ నవ్వుతుంటే మరింత అందంగా వుంది ...కాసేపట్లో ఆవిడతో కలసిపోయము .ఆమె అమ్మమ్మ చెల్లి కోడలాట.. మా అమ్మకి తమ్ముడు వరుస అవ్వుతాడు ..అతను కొవ్వూరు క్యాంపు కి వస్తు ఆమెను కూడా తీసుకు వచ్చాడట .మాకు చుట్టాలు అప్పటివరకు సరిగ్గా తెలియదు..వున్నా రెండురోజులు సరదాగా గడిచిపోయింది..ముఖ్యంగా అక్కా నేను ఆమె అందాన్ని తెగ అడ్మిరే చేసేవాళ్ళం .
తరువాత మేము కాలేజికి వచ్చాక నాన్నగారు పనిచేసే ఊర్లోనే అమ్మ వాళ్ళ కజిన్ వాళ్ళుకూడా ట్రన్స్ఫెర్మీద రావడం ఆమె తన పిల్లల్ని తీసుకు రావడం మేము వెళ్ళడం జరిగిందీ ..ఆమెలో అందం ఏ మాత్రం తగ్గలేదు సరికదా అప్పటికంటే ఇంకా అందంగా వుండినది .ఏ చీర కట్టిన బొమ్మలా వుండేది .
నా నిశ్చితార్ధం రోజు ఆమెదే మా అత్తగారి తరుపు హడావిడి ....ఎందుకంటే ఆమె ఆ ఇంటి పెద్దకోడలు కాబట్టి ...నేను ఆ ఇంటి చిన్న కోడలిని ...ఆ బాపు బొమ్మ నా తోటికోడలు.ఇప్పటికి ఏభయ్యేళ్ళ వయస్సంటే ఎవ్వరు నమ్మరు నలభయ్యిలో అడుగు పెట్టినట్లున్టది....అమృతం తాగుతున్నావా అని అడుగుతుంటాను...అన్నిటికి నవ్వే తన సమాధానం ......
మూడు రోజులక్రితం హటాత్తుగా తలనొప్పి తీవ్ర జ్వరం తో పడిపోయి ఒక రోజంతా కోమాలో వుండి...మృత్యు ముఖం నుంచి బయటపడింది బ్రెయిన్ ఫివేర్ ..ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా ..మనలోకం లోకి వచ్చి తన లోకం లోకి వెళ్ళిపోతుంది ..మెలుకువ వస్తే అందరికోసం చూస్తుంది అదీ నిమిషాలే ....కోలుకుని మాలోకి రావాలని అందరం ఎదురుచూస్తున్నాం ...ఆ పిల్లలు మరీ తల్లడిల్లుతున్నారు .....ఆ పైవాడు ఏం చేస్తాడో చూడాలి ....

8, అక్టోబర్ 2009, గురువారం

నేనంటే క్రేజ్ ....

నేనంటే ఎంత క్రేజ్ అర్ధం అవ్వుతుందిఈ మద్య బ్లాగ్ లో పదెపదె నన్ను తలుచుకుంటూ నా పేరుతో కామెంట్స్ రాస్తున్నారు,రాసేది ఆడో మగో కూడా బొత్తిగా అర్ధం కావడం లేదుకాని తరచి తరచి ఆలోచించగా ఈ రెండు జాతి కాకుండా మూడో జాతివాళ్ళని అర్ధం అవ్వుతుంది ...
ఏమైతేనేం "చిన్ని"అంటే పిచ్చి క్రేజ్ అనితెలుస్తుంది

6, అక్టోబర్ 2009, మంగళవారం

ఎవడి గోల వాడిదే

ఎవరిగోల వారిదంటే ఇదే కాబోలు ..ప్రకృతి వైపరీత్యలకి ఎవరు మాత్రం ఏమి చేయగలరు,ముందే గమనించితే సాద్యమైనంత (అంటే మానవునికి చేతనైనంత ) నివారణ ముందస్తు జాగ్రత్త తీసుకోవడం తప్పించి .ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యమైన కర్తవ్యం,మిగిలినవి అంటారా''బ్రతుకుంటే బలిసాకుతిని అయిన గడపొచ్చు"అనే నానుడి వుండనేవుంది.
కాని ఈ మీడియా ముఖ్యంగా ఎలెక్ట్రోనిక్ వాళ్ళు చేసే హడావిడి చూస్తుంటే చాల విచారం కలుగుతుంది,ఇరవయ్యి నాలుగు గంటల సమాచారం పేరుతో చెప్పడానికి ముడిసరుకు(-వార్తలు )లేక పూసింది అంటే కాసేసింది అంటూ వక్రభాష్యం చెబుతూ సగం ప్రజలలో భయాందోళనలు కలగచేయుచున్నారు .మూడు రోజుల నుండి వరధప్రాంతల్లో జిల్లా యంత్రాంగం పోరుగుజిల్లా యంత్రాంగం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ప్రజలు 'అతి ధీమా 'తో యంత్రాంగానికి సహకరించక ఇప్పుడు నిండా నీరు వచ్చి మునిగాక వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని,అన్నం ,పాలు లేవని చలికి వణుకుతున్నాంఅని ,మూగజీవాలు సైతం కరకట్టల్లో ఆవాసం చేయాల్సి వస్తుందని ,కరకట్టల మీదే వంటలని మీడియా ని పిలిచి కధనాలు చెబుతుంటే ,వారికి మీడియా తందాన అంటూ అధికారులు నిర్లక్ష్యం కరకట్టల మీద వంటలు అంటూ కధనాలు .....ఇదే మీడియా వారిని ఎందుకు ఖండించదు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి ,ప్రభుత్వం ,సేవ సంస్థలు వసతి బోజనాలు ఏర్పాటు చేసారు,ఆస్తులుకాదు ముఖ్యం ప్రాణాలు కాపాడుకుని ,కట్టు విప్పి మూగజీవాల ప్రాణం కాపాడమని ....అలాచెబితే ఎలా అక్కడితో కథ సుఖాంతం అవ్వుతుంది కదా ,కధనాలు వెదుక్కోవాలి కదా ..
ఇప్పటికిప్పుడు కొల్లూరు మండలం 'పెసరలంక 'లో జరగని పడవ ప్రమాదాన్ని జరిగినట్లు వక్రీకరించడం ...వార్తా వచ్చినపుడు అన్నీ పరిశీలించాకే చెప్పాలి ..అంటే కాని కథలు సృష్టించడం కాదు .ఏదేమైనా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రాంగం తమ ఇల్లు వాకిళ్ళు వదిలి రాత్రి పగలు బేదం యెరుగక''మీకు మేము ఉన్నాం ''అని వరద భాదిత సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు .....ఇవ్వేమి మీడియా కి కనబడవు .....వినబడవు ....

4, అక్టోబర్ 2009, ఆదివారం

కర్తవ్యం

మన చుట్టూ ఆవరించిన'' పెను చీకటిని ''తిట్టుకుంటూ,భాధ పడటం కంటే మనమే ముందుకు వచ్చి ''దీపం ''వెలిగిస్తే కొంతైనా చీకటిని పారద్రోలగలం.