29, ఆగస్టు 2009, శనివారం

సాయంసమయంలో

మలి సంధ్యవేళలో ...
కడలి అంచున నేను
మదిన మౌనగీతం ఆలపిస్తూ ...
అనంతమైన ఆకాశం లోని
నీలి మేఘాల పరదా కప్పుకుని
ఎగిసిపడే అలల నురుగ చూస్తూ
అల్లరి గాలికి ఎగిసిపడే వలువలనదిమి
కలల ప్రపంచంలో నీకై విహరిస్తున్నాను
తారలన్నీ రేరాజు చేరి సరసమడే వేళ
చిన్నబోయిన మోముతో దిక్కుదోజక
చుక్కల నీ జాడలు వెదుకుచు ...సొమ్మసిల్లిన నా మేను
తొలి ప్రొద్దు పొడుపుకై తూరుపు దిశ నా "తిరోగమనం"....

11 కామెంట్‌లు:

ప్రణీత స్వాతి చెప్పారు...

వహ్వా..వహ్వా చాలా బాగుంది!!

Hima bindu చెప్పారు...

@ప్రణీత
నిజంగానా !.థన్క్యు.:)

మధురవాణి చెప్పారు...

మీ భావోద్వేగానికి బహు ముచ్చటైన అక్షర రూపాన్ని ఇచ్చారు :)

శివ చెరువు చెప్పారు...

oka nimisham nene theeramlo ninchunnanemo ani pinchindi..

మురళి చెప్పారు...

చాలా బాగుందండీ...

sunita చెప్పారు...

baagundi.

ఉమాశంకర్ చెప్పారు...

రోజూ ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాడని తెలుసు కదండీ.. అంతలోనె తొందరపడి రాసేయాలా? :)

బాగుందండీ..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

బాగుందండీ...

Hima bindu చెప్పారు...

@మధురవాణి
-:)ధన్యవాదాలండి
@శివచెరువు
అంత ఫీల్ కలగిందంటే మనం రాసినవి నిరభ్యంతరం గా బ్లాగ్ లో పెట్టేయోచ్చన్నమాట!..ధన్యవాదములు.
@మురళి
-:)
@సునీత
-:)
@ఉమా
హు....తొందరపడ్డాన-:(
@శేఖర్
-:)

anagha చెప్పారు...

chaaaaaalaaaaa............bagundhi...nene akkadunnattu.

పరిమళం చెప్పారు...

చిన్నిగారు మీ భావాల్ని అందంగా అమర్చారు .బావుందండీ ...